ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి బాగయ్య
సాక్షి, మేడ్చల్: కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నడుపుతోందంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి బాగయ్య స్పష్టంచేశారు. తాము ప్రజా సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ అంశాన్ని చర్చించడం లేదని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దళిత, గిరిజనులను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తోందని చెప్పారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో ఆదివారం ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయం 8.30 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భేటీ అనంతరం బాగయ్య ఆరెస్సెస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్యతో కలసి మీడియాతో మాట్లాడారు. కేరళలో హిందూవాదులు, ఆరెస్సెస్ కార్యకర్తలులపై దాడులు, రాజకీయ హత్యలు, పర్యావరణ సమతుల్యత, అంటరానితనం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి పలు తీర్మానాలను కేంద్ర కమిటీకి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఏపీలో పదేళ్లలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన రూ.25 వేల కోట్లను పక్కదారి పట్టించారని, ఆ నిధులను ఆ వర్గాల అభివృద్ధికే వెచ్చించాలని డిమాండ్ చేశారు.
దళితులపై ఇంకా వివక్ష..
దేశంలో అనేక ప్రాంతాల్లో దళితులు నేటికీ వివక్ష ఎదుర్కొంటున్నారని బాగయ్య పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఒక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అందులో మధ్యప్రదేశ్లో 9 వేల గ్రామాల్లో, మహారాష్ట్రలో దేవగిరి ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలోని 489 గ్రామాల్లో దళిత, గిరిజనులకు పలు దేవాలయాలు, మంచినీటి బావులు, చెరువులు, శ్మశానవాటికల్లోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు.
పలు గ్రామాల్లోని హోటళ్లలో రెండు గ్లాసుల విధానం ఇంకా కొనసాగుతోందన్నారు. దీన్దయాళ్ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏకాత్మ మానవతా దర్శనం పేరుతో దేశాలు, వ్యక్తుల మధ్య విద్వేషాలు లేకుండా చేసేందుకు ఆరెస్సెస్ కృషి చేస్తోందన్నారు. ప్రకృతి తల్లి లాంటిదని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపుతామని స్పష్టంచేశారు. కోల్కతాలో హిందూ సమాజంపై దాడులు జరుగుతున్నాయని, విద్రోహ శక్తులు పెట్రేగి పోతున్నాయన్నారు.
దుర్గా నిమజ్జనంలో విధ్వంసం జరిగినా బెంగాల్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మైనార్టీలను సంతృప్తి పరచటానికి హిందువుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కేరళలో కమ్యూనిస్టుల రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. సమావేశాలకు మోహన్ భగవత్తోపాటు ఆరెస్సెస్ అఖిల భారత ప్రధానకార్యదర్శి సురేష్ భయ్యాజీ వంటి ప్రముులు హాజరయ్యారు.
నేడు అమిత్షా రాక!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సోమవారం సమావేశాలకు రానున్నారని ఆరెస్సెస్ నాయకులు తెలిపారు. ఆదివారమే రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సోమవారానికి వాయిదా పడ్డట్లు వివరించారు.
కేంద్రాన్ని ఆరెస్సెస్ నడపడం లేదు
Published Mon, Oct 24 2016 2:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement