భారత్‌ క్రికెట్‌కు ఇది తీవ్ర బాధాకరం! | Sakshi
Sakshi News home page

భారత్‌ క్రికెట్‌కు ఇది తీవ్ర బాధాకరం!

Published Wed, Jun 21 2017 6:27 PM

భారత్‌ క్రికెట్‌కు ఇది తీవ్ర బాధాకరం!

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి నుంచి అనిల్‌ కుంబ్లేను తప్పించిన విధానంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవస్కర్‌ మండిపడ్డారు. ఇది భారత్‌ క్రికెట్‌కు చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘విరాట్‌కు, అనిల్‌కు మధ్య విభేదాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఇది నిజంగా భారత్‌ క్రికెట్‌కు బాధాకరమైన రోజు’అని సన్నీ విచారం వ్యక్తం చేశాడు.

‘అనిల్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి భారత్‌ ఎన్నో విజయాలు సాధించింది. ఒక్క సంవత్సరంలోనే అనిల్‌ పెద్ద తప్పులు చేసినట్టు నాకేమీ అనిపించడం లేదు. ప్రతి జట్టులోనూ విభేదాలు ఉండనే ఉంటాయి. కానీ విజయాలను చూడాలి’ అని ఆయన ‘ఎన్డీటీవీ’తో పేర్కొన్నాడు. వీరోచిత పోరాటయోధుడిగా పేరొందిన కుంబ్లే మరికొన్నాళ్లు భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందిస్తాడని తాను భావించానని, సీఏసీ అతనిపై విశ్వాసం కనబర్చిన నేపథ్యంలో కుంబ్లే నిలబడి పోరాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

Advertisement
Advertisement