ముంబై: బాలీవుడ్ హీర్ సైఫ్ ఆలీఖాన్ కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. 2012లో ఓ ఎన్నారైపై దాడి చేసిన కేసుకు సంబంధించి కోర్టు సైఫ్ పై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు విచారించిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 30కు వాయిదా వేసింది. గత రెండు సంవత్సరాలక్రితం ముంబై తాజ్ హోటల్ లో దిగిన దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుడు ఇక్భాల్ శర్మపై సైఫ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైఫ్ పై 325, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ హోటల్ లో దిగిన తనపై సైఫ్ అన్యాయంగా దాడి చేశాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైఫ్ అతని స్నేహితులతో కలిసి దాడికి ఒడిగట్టినట్లు తెలిపాడు. ఆ సమయంలో సైఫ్ ప్రక్కనే హీరోయిన్లు కరీనా కపూర్(ప్రస్తుతం సైఫ్ భార్య), మలైఖా ఆరోరా ఖాన్ లు ఉన్నారని శర్మ పేర్కొన్నాడు.