సాక్షి నెట్వర్క్: పైలీన్ తుపాను గడియల్లోనూ.. దసరా శరన్నవరాత్రి వేడుకల్లోనూ సీమాంధ్రలో ఒక్కటే నినాదం మార్మోగుతోంది. ‘సేవ్ సమైక్యాంధ్రప్రదేశ్’.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీవర్షాలు కూడా లెక్కచేయక జనం రోడ్లపైకి సమైక్యనినాదాలు హోరెత్తించారు. ఇక అమ్మవారి నవరాత్రి వేడుకల్లో రాష్ర్టం ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేపట్టారు. వరుసగా 74వరోజైన శనివారం సమైక్యవాదులు వివిధరూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. శ్రీకాకుళం పాలకొండలో వర్షం కురుస్తున్నా ఎన్జీవోలు, ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. బెలగాంలో దుర్గాదేవి అవతారంలో తెలుగుతల్లి సమైక్యాంధ్ర ద్రోహులపై ఆగ్రహంచినట్లు వినూత్న తరహాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన రైతు, మహిళ, కార్మిక గర్జనకు వేలాది మంది పోటెత్తారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా చైర్మన్ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్ మాట్లాడుతూ విభజనను అడ్డుకోకుండా పదవుల్లో కొనసాగుతూ డ్రామాలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో సమైక్య నినాదంతో విద్యార్థులు గర్జించారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. రైల్వేకోడూరులో విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం, మైదుకూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సమైక్య ద్రోహి ఎంపీ చింతామోహన్ అంటూ నినాదాల్ని హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
కృష్ణాజిల్లా నాగాయలంకలో రహదారులను దిగ్భంధించి వంటావార్పు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పత్తి మొక్కలతో రైతులు ఆందోళన చేపట్టారు. రేపల్లెలో రైతుగర్జన సభ నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్జీఓ హోమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడగడపకూ సమైక్యనినాదం పేరిట కార్యక్రమం నిర్వహించారు.
సమైక్యాంధ్ర దళిత జేఏసీ కన్వీనర్ హత్య
నెల్లూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర దళిత జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బిరదవోలు చిరంజీవి (35) దారుణహత్యకు గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లకు చెందిన చిరంజీవి మృతదేహం గ్రామ సమీపంలోని కాలువలో ఉండగా పశువుల కాపర్లు గమనించారు. చిరంజీవి గొంతు, వీపుపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. మృతుడి మోటారు సైకిల్ రోడ్డు పక్కనే ఉంది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే చిరంజీవి సమైక్య ఉద్యమంలో భాగంగా దళిత జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికయ్యారు. ఆధారాలు సేకరించామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ చెప్పారు.
తేరుకున్న విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అల్లర్లతో అతలాకుతలమైన విజయనగరం తేరుకుంటోంది. ఇన్నాళ్లూ పగలూ రాత్రీ భయంతో ఇళ్లలో గడిపిన జనం ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తున్నారు. అధికారులు పగటి పూట కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు సరుకులు కొనుక్కునేందుకు మార్కెట్ బాట పడుతున్నారు. దసరా, మరో వారంలో జరగనున్న పైడితల్లమ్మ పండుగలకు ఏర్పాట్లు చేసుకునే నిమిత్తం ప్రజలు కొనుగోలు బాట పట్టారు. దాదాపు రెండునెలల తరువాత పట్టణంలో సందడి నెలకొంది. కాగా, ఆదివారం ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సీమాంధ్రలో మార్మోగుతున్న నినాదం
Published Sun, Oct 13 2013 4:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement