మేం గెలిస్తే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ... | Sakshi
Sakshi News home page

మేం గెలిస్తే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ...

Published Tue, Sep 6 2016 8:24 AM

మేం గెలిస్తే స్మార్ట్ ఫోన్లు ఫ్రీ...

లక్నో: 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ(ఎస్పీ) కొత్త వ్యుహంతో ముందుకొచ్చింది. గతం ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ల్యాప్ టాప్ లు అందిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎస్పీ.. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తే స్మార్ట్ ఫోన్ల ను అందజేస్తామని ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్ ను అందుకోవాలనుకున్న వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. 2017 ప్రథమార్ధం తర్వాత ఫోన్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ఇళ్లకు పంపుతారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని చేరవేడానికి ఫోన్ వారధిగా ఉపయోగపడతుందని పేర్కొంది. సరికొత్త సాఫ్ట్ వేర్ తో రన్ అయ్యే ఈ ఫోన్లలో ప్రభుత్వానికి పథకాల మీద ఫీడ్ బ్యాక్ ను పంపేందుకు ప్రత్యేకమైన అప్లికేషన్ ఉంటుందని తెలిపింది.

18 ఏళ్లు నిండి, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2లక్షలకు మించని వారందరూ ఫోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ , ఎస్పీల మధ్య తీవ్రపోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ యువత ఓట్లను కొల్లగొట్టడానికి స్మార్ట్ ఫోన్ అస్త్రాన్ని ఎన్నుకుంది. సెప్టెంబర్ మొదటివారం తర్వాత స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement