ముఖ్య కార్యదర్శులను పంపండి!: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ | Sakshi
Sakshi News home page

ముఖ్య కార్యదర్శులను పంపండి!: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ

Published Thu, Oct 24 2013 2:38 AM

send chief secretaries for discussion over state bifurcation: Central government

రాష్ట్ర విభజనకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలు కీలక శాఖల సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఢిల్లీకి పంపాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 25న కేంద్ర హోంశాఖ కార్యదర్శి కార్యాలయంలో జరగనున్న సమావేశానికి వీరు హాజరు కావాల్సి ఉంటుందని రాష్ట్రప్రభుత్వానికి రాసిన లేఖలో హోంశాఖ పేర్కొంది. నీటిపారుదల, రెవెన్యూ, ఆర్థికం, విద్య, హోం, ప్రణాళిక, న్యాయ, సాధారణ పరిపాలన త దితర కీలక శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ముఖ్య కార్యదర్శులు ఆ సమావేశానికి రావాలని అందులో సూచించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement