లాభాలతో మొదలైన స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో మొదలైన స్టాక్మార్కెట్లు

Published Tue, Nov 22 2016 9:29 AM

Sensex gains over 150 pts, Nifty opens firm; ONGC, Tata Motors up

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.   ఆరంభ లాభాలనుంచి మరింత  పుంజుకున్న సెన్సెక్స్196  పాయింట్ల లాభంతో  25,961 వద్ద,  నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 7998 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ మళ్లీ ఎనిమిది వేల  స్థాయికి చేరువలో ఉంది.  దాదాపు అన్ని రంగాలు  పాజిటివ్ గా ఉన్నాయి. గత  కొన్ని సెషన్లుగా బలహీనంగా  ఉన్న దేశీయ  సూచీల్లో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది.  ముఖ్యంగా ఎంఅండ్ ఎం, ఎస్ బీఐ ఓఎన్ జీసీ, టాటా మోటార్స్ ,  భారీగా లాభపడుతున్నాయి.

అటు కరెన్సీ మార్కెట్ లో  ఆరంభంలో రూపాయి నిన్నటి నష్టాలనుంచి కోలుకున్నా మళ్లీ నీరసించింది.  డాలర్ మారకపు విలువలో 3 పైసలు నష్టపోయి 68.17 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా.180  రూపాయల లాభంతో రూ. 29,120 వద్ద ఉంది.

 

Advertisement
Advertisement