లక్నో: పట్టుమని వారం రోజులైనా ప్రశాంతత నెలకొందోలేదో.. సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ విమర్శల పర్వం మొదలైంది. పార్టీ కంటే ప్రభుత్వం గొప్పది కాదంటూ బాబాయ్ శివపాల్ యాదవ్.. అబ్బాయి అఖిలేశ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన శివపాల్.. '2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేలా మహా కూటమి ఏర్పాటుచేయాలనుకున్నాం. కానీ పార్టీలోని కొందరు ఆ ప్రయత్నాలను విచ్ఛిన్నం చేశారు. పార్టీని చీల్చే కుట్రలు చేశారు. నన్ను ఎంత అవమానించినా భరిస్తా. కానీ నేతాజీ(ములాయం)ను ఒక్క మాటన్నా సహించను. తిరుగుబాటుదారుల అంతు చూస్తా'అని పరోక్షంగా అఖిలేశ్ వర్గానికి తీవ్ర హెచ్చరికలు చేశారు.
సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే బాబాయ్, అబ్బాయ్ వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో గురువారం(నవంబర్ 3) నుంచి ప్రారంభం కానున్న సీఎం అఖిలేశ్ రథయాత్ర ఏమేరకు విజయవంతం అవుతుందనేదానిపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదటి రోజు యాత్ర జరుగనున్న (లక్నో నుంచి ఉన్నావ్ వరకు) 60 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటయ్యాయి. శివపాల్ వర్గీయులు కూడా కొన్ని చోట్ల అఖిలేశ్ ను స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటుచేయడం గమనార్హం. 'శివపాల్ ఆశీస్సులతో అఖిలేశ్ కు మరోసారి పట్టాభిషేకం' అనే నినాదాలు పలు చోట్ల కనిపించాయి.
మరోవైపు సమాజ్ వాదీ సుప్రిమో ములాయం మహా కూటమి ఏర్పాటు యత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం ములాయంతో దాదాపు రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. నవంబర్ 5న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇప్పటికే జనతా పరివార్ పార్టీల ముఖ్యులందరికీ ఆహ్వానాలు అందాయి. ఎస్పీ యూపీ చీఫ్ శివపాల్ యాదవే స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేశారు. ఆ వేదికపై నుంచే మహా కూటమి ఏర్పాటు ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. ఎస్పీ వేడుకలకు వెళ్లబోనని ప్రకటించిన దరిమిలా మహాకూటమి ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. మరి కొద్ది గంటల్లో యూపీ ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పోరాడేది తేలిపోనుంది.
మళ్లీ కస్సుమన్న బాబాయ్
Published Wed, Nov 2 2016 7:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement