చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే... | Sakshi
Sakshi News home page

చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే...

Published Sat, Nov 26 2016 8:08 PM

చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే...

కోయింబత్తూర్ : కేంద్రమంత్రులు చెప్పులు కుట్టించుకోవడమా? వారు కో అంటే కోటి చెప్పులు వచ్చి వారి ముందు ఉంటాయి. అలాంటిది కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తన చెప్పులను రిఫైర్ చేయించుకున్నారు. రిఫైర్ చేయించుకోవడమే కాక, కుట్టినందుకు చెప్పులు కుట్టేవాడికి ఎంతిచ్చారో తెలిస్తే షాక్. తన చెప్పులు మరమ్మత్తులు చేసినందుకు చెప్పులు కుట్టేవాడికి ఏకంగా రూ.100ను చెల్లించారట. అతను కేవలం రూ.10 డిమాండ్ చేస్తూ ఆమె సుహృదయంతో మరో రూ.90 అదనంగా చెల్లించారట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర జౌళి, చేనేత శాఖా మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ, నేడు ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సెషన్కు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే ఆమె విమానం దిగుతున్నప్పుడు చెప్పుల పట్టీ ఊడిపోయింది.
Advertisement
Advertisement