సర్జికల్‌ స్ట్రైక్స్‌పై సోషల్‌ మీడియాలో ధూంధాం! | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ స్ట్రైక్స్‌పై సోషల్‌ మీడియాలో ధూంధాం!

Published Thu, Sep 29 2016 8:05 PM

సర్జికల్‌ స్ట్రైక్స్‌పై సోషల్‌ మీడియాలో ధూంధాం! - Sakshi

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి.. పలువురు ఉగ్రవాదుల్ని ఏరిపారేసినట్టు భారత సైన్యం ప్రకటించిన వెంటనే సోషల్‌ మీడియాలో ఒకరకమైన పండుగ వాతావరణం నెలకొంది.  18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థానీ ఉగ్రవాదులకు దీటుగా బుద్ధి చెప్పిన భారత ఆర్మీపై ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

భారత్‌పై దుందుడుకు చర్యలకు దిగినా, ఉగ్రవాద దాడులకు పాల్పడినా పాకిస్థాన్‌కు తగినవిధంగా బుద్ధి చెప్తామని ఎన్నికల సందర్భంలో మోదీ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సర్జికల్‌ స్ట్రైక్స్‌ (నిర్దేశిత దాడుల)తో మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఉడీ దాడిలో అమరులైన జవాన్లకు సైన్యం ఈ ఆపరేషన్‌ ద్వారా ఘనమైన నివాళులర్పించిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో దాయాది పాకిస్థాన్‌తో యుద్ధం వాంఛనీయం కాదని, యుద్ధం వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయని, కేవలం ఉగ్రవాద నిరోధం దిశగానే చర్యలు ఉండాలని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తారు. మొత్తానికి సర్జికల్‌ స్ట్రైక్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ (#SurgicalStrike)తో ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో బోలెడు పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement