మొగదీషు(సోమాలియా): మిలిటెంట్ అనుకుని పొరబడి ఓ మంత్రిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ సంఘటన సోమాలియా దేశంలో చోటుచేసుకుంది. అబ్బాస్ అబ్దుల్లాహి షేక్ సిరాజి(31) ఈ ఏడాది ఫిబ్రవరి నెల 8న ప్రజా పనులు, పునర్నిర్మాణం శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం దేశ అధ్యక్షుడి కార్యాలయ సమీపంలోకి కారులో వస్తుండగా.. సెక్యురిటీ గార్డులు అనుమానాస్పద కారుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబ్బాస్ సిరాజి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో సోమాలియా అధ్యక్షుడు తన ఇథియోపియా పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి అంత్యక్రియల్లో పొల్గొనబోతున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తప్పించారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 25 మంత్రుల్లో సిరాజ్ ఒకరు. సోమాలియా కేబినెట్లో అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అల్ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న షాబాబ్ తీవ్రవాదులు సోమాలియా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మొగదీషులో తరచుగా దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి.
మిలిటెంట్ అనుకుని మంత్రిని కాల్చేశారు
Published Thu, May 4 2017 7:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement