- కానిస్టేబుల్కు రూ. 2,500, హెడ్ కానిస్టేబుల్కు రూ. 3 వేలు
- ఏఎస్సైకి రూ. 3,500, ఎస్సైకి రూ. 4,000, సీఐకి రూ. 4,500
- 2 వేల మందికి లబ్ధి.. రెండ్రోజుల్లో ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వరాల జల్లు కురిపించనుంది. నిత్యం పొగ, దుమ్మూ ధూళి, శబ్ద కాలుష్యంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీనెల జీతంతో పాటు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానిస్టేబుల్కు జీతంతో పాటు రూ.2,500, హెడ్ కానిస్టేబుల్కు రూ.3 వేలు, ఏఎస్సైలకు రూ.3,500, ఎస్సైలకు రూ.4 వేలు, సీఐలకు రూ.4,500 అదనపు అలవెన్స్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువరించేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న 1,800 మందికి, ఇతర జిల్లాల్లో దాదాపు 2 వందల మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
మూడేళ్ల నిరీక్షణ: నిత్యం కాలుష్యం మధ్య విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదన మూడేళ్ల కింద తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులకు జీతంతో పాటు పొల్యూషన్ అలవెన్స్ కింద అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సిందిగా 2012లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్ హయాంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అప్పట్లో దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. పరిశీలించాల్సిందిగా ఆర్థిక శాఖకు సూచించింది. అయితే కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బందికి మాత్రమే అదనపు అలవెన్స్లు చెల్లించడం వల్ల జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయంటూ అధికారులు కొర్రీలు పెట్టారు. ఈ నేపథ్యంలో అలవెన్స్లపై చర్చించడం కోసం ఒక కమిటీ వేశారు. హైదరాబాద్లో వాహనాల సంఖ్య, కాలుష్యం ఎక్కువ కాబట్టి ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతంలో 30 శాతం అదనపు అలవెన్స్ చెల్లించాల్సిందిగా ఆ కమిటీ సూచించింది.
మిగతా జిల్లాల్లో వాహనాల సంఖ్య, వాటి నుంచి వెలువడే కాలుష్య శాతాన్ని లెక్కగట్టి సిబ్బందికి అదనపు అలవెన్స్ చెల్లించాల్సిందిగా సూచిం చింది. అయితే మూడేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలవెన్స్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిం చింది. పోలీసుశాఖకు ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్... ట్రాఫిక్ పోలీసుల విన్నపానికి సానుకూలంగా స్పందించారు. గతంలో కమిటీ ఇచ్చిన నివేదికతో సంబంధం లేకుండా అందరికీ అలవెన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్లు
Published Tue, Sep 15 2015 2:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement