వరుస ఓటములతో శ్రీలంక క్రికెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్వదేశంలో భారత్తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో క్లీన్స్వీప్ కావడం.. ఆ వెంటనే జరిగిన తొలి వన్డేలోనూ చిత్తుగా ఓడటం ఆ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పొథాస్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ బోర్డును ఇరకాటంలో పడేశాయి.
అనేక మంది పెద్దలు జోక్యం చేసుకోవడమే శ్రీలంక జట్టు ప్రస్తుత దుస్థితికి కారణమని పొథాస్ నిందించాడు. క్రికెటర్ల సెలక్షన్ మొదలు, జట్టు కూర్పు, వ్యూహాల అమలు, విధాన నిర్ణయాలు వంటి విషయాల్లో ఎక్కువమంది జోక్యం చేసుకుంటుండటం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, కోచ్ మీడియా వేదికగా ఇలా బాహాటంగా తమను వేలెత్తిచూపడం శ్రీలంక క్రికెట్ బోర్డు పెద్దలకు నచ్చలేదు. శ్రీలంక సెలక్షన్ కమిటీ చీఫ్గా లెజెండ్ క్రికెటర్ సనత్ జయసూర్య కొనసాగుతుండగా, జట్టు మేనేజర్గా అసంకా గురుసిన్హా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కోచ్ పొథాస్ వ్యాఖ్యలపై శ్రీలంక బోర్డు పెద్దలు కన్నెర్ర జేసినట్టు తెలుస్తోంది. దీంతో కోచ్ పొథాస్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తక్కువచేసి చూపే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ సవ్యంగా ఉందని, ప్రస్తుత దుస్థితిని నుంచి జట్టును బయటపడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పొథాస్ వివరణ ఇచ్చాడు. బోర్డులోని పెద్దల జోక్యం ఎక్కువ అవ్వడం వల్లే శ్రీలంక క్రికెట్ సంక్షోభానికి కారణమన్న తన గత వ్యాఖ్యలపై ఆయన మాట మార్చాడు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, తన ఉద్దేశం అది కాదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బోర్డు పెద్దలకు చెడ్డపేరు రాకుండా నష్టనివారణ చర్యల దిశగా కోచ్ మీడియా సమావేశం సాగింది. కోచ్ను బోర్డు పెద్దలు మందలించారని, వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే భారత్తో రెండో వన్డేకు ముందు హుటాహుటిన తన వ్యాఖ్యలపై కోచ్ పొథాస్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నాడని లంక క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
కోచ్కు చుక్కలు చూపెడుతున్న శ్రీలంక!
Published Thu, Aug 24 2017 9:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement