కొత్త ముసాయిదాలో కేంద్రం సూచన
న్యూఢిల్లీ: మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తంచేయాలంటూ కొత్తగా సిద్ధంచేసిన ‘సంకేత నిక్షిప్త సందేశాల పాలసీ’ ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కొత్త ముసాయిదా ప్రకారం... వాట్సప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా మరే ఇతర సేవల ద్వారా మొబైల్, కంప్యూటర్లో వచ్చే సందేశాలను మూల వాక్యాల రూపం(ప్లేన్ టెక్ట్స్ ఫార్మాట్)లో దాచి ఉంచాలి.
పరిశీలన, అధ్యయనం నిమిత్తం భద్రతా సంస్థలు అడిగినపుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నిక్షిప్తం చేయడంలోగానీ, అందివ్వడంలోగానీ విఫలమైతే చట్టపరంగా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సంకేత నిక్షిప్త సందేశాల సాధనాలను ఆపరేటర్లు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, పౌరులు తమ అధికార, అనధికార సమాచారాన్ని మొత్తం అందివ్వాల్సి ఉంటుంది.
చట్టబద్ధ సంస్థలు, కార్యనిర్వాహక సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలను ‘బి’ కేటగిరీగా విభజించారు. పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను ‘సి’ కేటగిరీగా విభజించారు. ఈ కేటగరీల్లోని వారంతా మెసేజ్లు పంపిన రోజు నుంచి 90 రోజులపాటు వాటిని భద్రపరచాలి. విదేశాల్లో ఉండే వారితో, సంస్థలతో జరిపిన సంప్రదింపుల సందేశాలనూ అందివ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న వారిదే. వాట్సప్, వైబర్, లైన్, గూగుల్ చాట్, యాహూ మెసెంజర్ ఇలా అధునాతన మెసేజింగ్ సర్వీసుల్లో అత్యంత స్థాయి భద్రతతో సంకేత సందేశాలు నిక్షిప్తంచేస్తారు.
ఇలాంటి వాటిలోని సమాచారాన్ని సేకరించడం భద్రతా సంస్థలకు కష్టంగా మారడంతో కొత్తగా ఈ తరహా పాలసీని తెస్తున్నారు. అసలు గోప్యత అనేదే లేకుండా తెస్తున్న ఈ పాలసీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వారు తయారుచేసిన ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను అక్టోబర్ 15లోగా కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది.
మెసేజ్ల స్టోరేజీ తప్పనిసరి
Published Tue, Sep 22 2015 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement