ఆత్మాహుతి దాడిలో 75 మంది విద్యార్థుల మృతి | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడిలో 75 మంది విద్యార్థుల మృతి

Published Mon, Nov 10 2014 5:24 PM

Suicide bomber kills 75 students in Nigeria

నైజీరియాలోని ఓ స్కూల్లో అసెంబ్లీ జరుగుతుండగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 75 మంది విద్యార్థులు మరణించారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్కూలు యూనిఫాం ధరించి వచ్చిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సంఘటన స్థలంలో ఉండి, బతికి బయటపడ్డవాళ్లు చెబుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడకు వచ్చిన సైనికులను స్థానికులు రాళ్లతో కొట్టి తరిమేశారు. ఐదేళ్లుగా దేశంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు చొరబడుతుంటే ఆపలేనివాళ్లు ఇక్కడికి ఎందుకు వస్తారంటూ మండిపడ్డారు.

ఈ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికి వేలాదిమంది మరణించారని, లక్షలాది మంది ఇళ్లు వదిలిపెట్టి పోయారని అన్నారు.నైజీరియాలోని యోబ్ రాష్ట్ర రాజధాని నగరమైన పోటిస్కుంలో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది మరణించారు. ప్రభుత్వ సాంకేతిక శాస్త్ర కళాశాలలో సోమవారం నాటి అసెంబ్లీలో సుమారు రెండు వేల మంది విద్యార్థులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement