ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

Published Tue, Jul 14 2015 1:20 AM

suicide of the young man did not get job

అవయవాలు దానం చేయాలని నోట్
 

తాడిమర్రి: ఉద్యోగం రాలేదని మనోవేదనకు గురైన ఓ యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన అవయవాలు దానం చేయాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన సాకే వెంకటేష్, లక్ష్మమ్మ కుమారుడు సాకే వెంకటేష్(25) డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను పోషించాలని తీవ్ర ప్రయత్నం చేశాడు.

ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదు. తల్లిదండ్రుల సంపాదనపై బతకాల్సి వస్తోందని మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ కూడా రాశాడు.
 
 

Advertisement
Advertisement