గ్రామంలో నక్కిన ఉగ్రవాదులు | Sakshi
Sakshi News home page

గ్రామంలో నక్కిన ఉగ్రవాదులు

Published Thu, Dec 29 2016 9:44 AM

గ్రామంలో నక్కిన ఉగ్రవాదులు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని బందిపోరా జిల్లాలో గల హైజిన్ గ్రామంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు గురువారం ఉదయం దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఓ ఆర్మీ జవానుకు గాయాలైనట్లు రిపోర్టులు వచ్చాయి. ఈ నెల 22వ తేదీన కూడా హైజిన్ లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో పారామిలటరీ బలగాలు గ్రామాన్ని తమ చేతిలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం టెర్రరిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
గత నెల 25వ తేదీన ఇదే ప్రదేశంలోని ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఆర్మీ జవానును కాల్చి చంపారు. గత ఏడాది కాలంగా 430 సార్లు పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు శీతాకాల పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రక్షణ శాఖ సహాయక మంత్రి సుభాష్ భామ్రే పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement