బీరుట్: సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో బుధవారం ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన దాడులకు 1,300 మంది అమాయక పౌరులు బలయ్యారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. ప్రభుత్వ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రసాయన దాడులకు గురైన ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న తూర్పు ఘౌటాలో గురువారం ఉదయం ప్రభుత్వ యుద్ధవిమానాలు మళ్లీ బాంబుల వర్షం కురిపించాయి.
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలపై అధ్యక్షుడు బషర్ అసద్ బలగాలు గురువారం కూడా బాంబుల వర్షం కురిపించాయని ప్రతిపక్షం ఆరోపించింది. రసాయనదాడికి గురైన తూర్పు ఘౌటాలోనే మళ్లీ జరిగిన ఈ బాంబుదాడులపై మాట్లాడేందుకు మాటలు రావడంలేదని బ్రిటన్కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్’ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మరోపక్క అమాయక పౌరులతోపాటు పసిపిల్లలపై సైతం రసాయన దాడులకు పాల్పడటంపై యూనిసెఫ్ తీవ్రంగా మండిపడింది. బాలల హక్కులు కాపాడాలని, హక్కులు కాలరాసినవారు బాధ్యత వహించకతప్పదని హెచ్చరించింది.
చట్టాల ఉల్లంఘనే.... బాన్ కీ మూన్
సిరియా ప్రజలపై రసాయన దాడితో ప్రభుత్వం దారుణ మారణకాండకు పూనుకుందన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. ‘రసాయన ఆయుధాలను ఏ పక్షమైనా సరే.. ఏ పరిస్థితుల్లోనైనా సరే.. ప్రయోగించడం అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించడమే’నని స్పష్టంచే శారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం ప్రభుత్వ బలగాలు రసాయనదాడులు జరుపగా 1,300 మంది పౌరులు బలయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ దాడులపై బుధవారం నాటి అత్యవసర సమావేశంలో ఐరాస భద్రతామండలి ఆందోళన వ్యక్తంచేసింది. అయితే దీనిపై శాశ్వత సభ్యదేశాల మధ్య భేదాభిప్రాయం తలెత్తింది. సిరియాపై కఠిన చర్యలకు చైనా, రష్యా వ్యతిరేకించగా.. సిరియాలో ఉన్న ఐరాస బృందంచేత నిష్పాక్షిక దర్యాప్తు జరపాలంటూ సెక్రటరీ జనరల్కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లేఖ రాశాయి.
కాగా, సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను మిత్రదేశం ఇరాన్ తోసిపుచ్చింది. రసాయన దాడులు జరిగి ఉంటే.. అందుకు రెబెల్స్దే బాధ్యతని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదముఠాలు ఏ నేరానికైనా వెనుదీయవని, రసాయన దాడులు వాటి పనే అయి ఉంటుందని పేర్కొంది.
సిరియాలో కొనసాగుతున్న ప్రభుత్వ బలగాల దాడులు
Published Fri, Aug 23 2013 4:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement