టాటా హెక్సా వచ్చేసింది..ధర ఎంత? | Sakshi
Sakshi News home page

టాటా హెక్సా వచ్చేసింది..ధర ఎంత?

Published Wed, Jan 18 2017 1:46 PM

టాటా హెక్సా వచ్చేసింది..ధర ఎంత?

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ కార్ల​ దిగ్గజం టాటా  మోటార్స్‌​  ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి కొత్త వాహనాన్ని రిలీజ్‌​ చేసింది. టాటా  హెక్సా​  ఎస్‌ యూవీనీ భారత మార్కెట్లో  బుధవారం లాంచ్‌ చేసింది. దీని బేస్‌ వేరియంట్‌ ధరను  రూ.11.99లక్షలు(ఢిల్లీ ఎక్స్‌​ షో రూం ధర)  టాప్‌ ఎండ్‌  వేరియంట్‌ ధరను రూ. 17.49లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌​ షో రూం ధర)  నిర్ణయించింది.

2.2 లీటర్‌ వేరీకార్‌ 320, 2.2 లీటర్‌ వేరీకార్‌ 400 ఇంజిన్‌ సామర్థ్యంతో రెండు వేర్వేరు మోడల్స్‌తో హెక్సాను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత షోరూముల్లో ఐదు రకాల రంగుల్లో ఇది లభించనుంది.   ఎక్స్‌​, ఎక్స్‌ టీఏ,  ఎక్స్‌ టీ ఎంటీ 4x4 అనే  మూడు  వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.   19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్‌ రైల్స్‌​, క్రోమ్  యాక్సెంట్స్‌​ విత్‌  డే టైం ట లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ తదితరాలు ఫీచర్లు ఇందులో  ఉన్నాయి. కేవలం ఎక్స్‌ టీ ఎంటీ 4x4  వేరియంట్ లో మాత్రం  ఫోర్‌ వీల్స్‌​  డ్రైవ్ సిస్టమ్  అమర్చారు.

 డిమాండ్‌ ఊహించిన దానికంటే  భారీగా ఉందని సంస్థ  పాసింజర్‌  వాహనాల  విభాగం అధ్యక్షుడు  మయాంక్‌ పరీక్‌ సంతోషం వ్యక్తం చేశారు. గత ఎనిమిది వారులుగా దీనికోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పారు. 2016 ఆటో ఎక్స్‌​ పో లో టాటా  మోటార్స్‌​ దీన్ని ప్రదర్శించింది.  మూడుదేశాల స్టూడియోల్లో దీన్ని డిజైన్‌ రూపొందించినట్టు కంపెనీ చెప్పింది.  మూడు ఖండాల్లో ఎనిమిది లక్షల కి.మీ మేర టెస్ట్‌  డ్రైవ్‌ నిర్వహించింది.

గత  కొంతకాలంగా హాట్‌ టాపిక్‌ గా నిలిచిన హెక్సా​  లాంచింగ్‌ తో  టాటా మోటార్స్  భారత  ఎస్‌యూవీ మార్కెట్‌ లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు టయోటా ఇన్నోవా, మహీంద్రాలకు గట్టి పోటీగా  టాటా మెటార్స్‌​  హెక్సా​ నిలవనుంది.  అంతేకాదు  హెక్సా  ఇప్పటికే 3000 బుకింగ్స్‌​ సాధించిందని టాటా మోటార్స్  తెలిపింది.

 

Advertisement
Advertisement