న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి కొత్త వాహనాన్ని రిలీజ్ చేసింది. టాటా హెక్సా ఎస్ యూవీనీ భారత మార్కెట్లో బుధవారం లాంచ్ చేసింది. దీని బేస్ వేరియంట్ ధరను రూ.11.99లక్షలు(ఢిల్లీ ఎక్స్ షో రూం ధర) టాప్ ఎండ్ వేరియంట్ ధరను రూ. 17.49లక్షలుగా (ఢిల్లీ ఎక్స్ షో రూం ధర) నిర్ణయించింది.
2.2 లీటర్ వేరీకార్ 320, 2.2 లీటర్ వేరీకార్ 400 ఇంజిన్ సామర్థ్యంతో రెండు వేర్వేరు మోడల్స్తో హెక్సాను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత షోరూముల్లో ఐదు రకాల రంగుల్లో ఇది లభించనుంది. ఎక్స్, ఎక్స్ టీఏ, ఎక్స్ టీ ఎంటీ 4x4 అనే మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్ రైల్స్, క్రోమ్ యాక్సెంట్స్ విత్ డే టైం ట లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ తదితరాలు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కేవలం ఎక్స్ టీ ఎంటీ 4x4 వేరియంట్ లో మాత్రం ఫోర్ వీల్స్ డ్రైవ్ సిస్టమ్ అమర్చారు.
డిమాండ్ ఊహించిన దానికంటే భారీగా ఉందని సంస్థ పాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీక్ సంతోషం వ్యక్తం చేశారు. గత ఎనిమిది వారులుగా దీనికోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు. 2016 ఆటో ఎక్స్ పో లో టాటా మోటార్స్ దీన్ని ప్రదర్శించింది. మూడుదేశాల స్టూడియోల్లో దీన్ని డిజైన్ రూపొందించినట్టు కంపెనీ చెప్పింది. మూడు ఖండాల్లో ఎనిమిది లక్షల కి.మీ మేర టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది.
గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా నిలిచిన హెక్సా లాంచింగ్ తో టాటా మోటార్స్ భారత ఎస్యూవీ మార్కెట్ లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు టయోటా ఇన్నోవా, మహీంద్రాలకు గట్టి పోటీగా టాటా మెటార్స్ హెక్సా నిలవనుంది. అంతేకాదు హెక్సా ఇప్పటికే 3000 బుకింగ్స్ సాధించిందని టాటా మోటార్స్ తెలిపింది.