విడిచిపెట్టిన మావోయిస్టులు.. పది రోజుల ఉత్కంఠకు తెర
జీకేవీధి: విశాఖ మన్యంలో 10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. మావోయిస్టుల అదుపులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తెల్లవారుజామున క్షేమంగా ఊరు చేరుకున్నారు. మావోయిస్టుల నిర్బంధంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల కృషి ఫలించింది. దీంతో టీడీపీ నేతలైన ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండ లం బాలయ్యలను మావోయిస్టులు క్షేమంగా విడిచిపెట్టారు.
ఈనెల 6వ తేదీన జీకేవీధి మండలం కొత్తూరు గ్రామం వద్ద టీడీపీ నేతలైన ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అపహరించిన సంగతి తెలిసిందే. అదుపులో ఉన్న గిరిజన టీడీపీ నేతలకు ఎలాంటి హాని తల పెట్టవద్దని గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కుటుంబ సభ్యులు, అఖిలపక్షం నేతలు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.
ఇంతలో ఈనెల 13 లోగా ప్రభుత్వం బాక్సైట్పై ప్రకటన చెయ్యాలని, లేదంటే తమ అధీనంలో ఉన్న గిరిజన టీడీపీ నేతలను హతమారుస్తామంటూ మావోయిస్టులు అల్టిమేటం విధించారు. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చిన సీఎం చంద్రబాబు బాక్సైట్పై తమ ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తన అభిప్రాయం వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు మావోయిస్టులు మానవతా దృక్పథంతో బుధవారం సాయంత్రం ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ అడవుల్లో టీడీపీ నేతలను సురక్షితంగా ఉపాధ్యాయ సంఘాలకు అప్పగించారు.
బాక్సైట్ జోలికొస్తే టీడీపీ అంతుచూస్తాం: మావోయిస్టు అగ్రనేతలు
బాక్సైట్ తవ్వకాలు చేపడితే టీడీపీ అంతు చూస్తామని మావోయిస్టు అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏవోబీ సరిహద్దు చిత్రకొండ అడవు ల్లో బుధవారం సాయంత్రం వీరు ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు కైలాసం, ఆజాద్, నవీన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల వల్ల తాము జీవనాధారం కోల్పోతామని ప్రజాకోర్టులో 20 గ్రామాలకు చెందిన ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నేతల విడుదల
Published Fri, Oct 16 2015 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement