చంచల్గూడ నుంచి చర్లపల్లికి.. | Sakshi
Sakshi News home page

చంచల్గూడ నుంచి చర్లపల్లికి..

Published Tue, Jun 2 2015 11:52 AM

చంచల్గూడ నుంచి చర్లపల్లికి.. - Sakshi

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.  ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.  దీనిపై ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు.  కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు.

Advertisement
Advertisement