ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అసలు చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన ఏమన్నారంటే...
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది.
- విభజన చట్టంలో అనేక అంశాలున్నాయి.
- అయినా.. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ఒక్క అంశంపై అయినా కేంద్రంతో పోరాడారా, కేంద్రాన్ని అడిగారా
- ఒకే ఒక్క అంశం.. అదీ సెక్షన్ 8 గురించి మాట్లాడారు
- ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఇలా చేశారు
- అది తప్ప ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు.
- ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు ఎవరికీ చిత్తశుద్ధి లేదు
- మేం వెల్ లోకి వెళ్లి, స్లోగన్లు ఇచ్చినప్పుడు వాళ్లు కలిసి రారు, నిరసన తెలపరు
- పైగా అడుగుతున్నందుకు మామీద వాళ్లకు కడుపు మంట, మమ్మల్ని విమర్శిస్తారు
- ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ రెండూ కలిసి ప్రచారం చేసినప్పుడు కచ్చితంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటాం అన్నారు
- పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం ఇచ్చారు
- ఈరోజు ఏరు దాటాక తెప్ప తగలబెట్టడం అంటే ఇది కాదా అని టీడీపీ, బీజేపీలను అడుగుతున్నా
- చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ
- ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడతారు. సుజనా చౌదరి ఒకరోజు ఇస్తామంటారు, ఒకరోజు ఇవ్వమంటారు
- 14వ ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పింది కాబట్టి ఇవ్వట్లేదంటారు
- అసలు ఆ కమిషన్ నివేదికలో ఒక్కచోటైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని రాసి ఉంటే చూపించండి
- దాని బూచి చూపించి హోదా ఇవ్వకపోవడం అన్యాయం.
- ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని అన్నప్పుడు.. వెంకయ్య లాంటి వాళ్లు సభలో ఐదు కాదు పదేళ్లు ఇవ్వాలని గట్టిగా అన్నారు
- ఇప్పుడు వాళ్లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి
- హోదా ఇచ్చేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద గట్టిగా పోరాడదామని విజ్ఞప్తి చేస్తున్నా.