టీనేజి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం! | Sakshi
Sakshi News home page

టీనేజి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం!

Published Sat, Apr 4 2015 5:49 PM

టీనేజి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం! - Sakshi

తమిళనాడులో ఘోరం జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ స్కూలు టీచర్ పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల వయసున్న ఆ టీచర్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. శ్రీపెరుంబుదూర్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిపై అతడు కంప్యూటర్ గదిలో అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు.

విపరీతంగా వాంతులు అవుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించడతో అప్పుడు టీచర్ దారుణాన్ని గురించి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. లోకనాథన్ అనే ఆ టీచర్కు ముగ్గురు పిల్లలున్నారు. అతడిపై పోస్కో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు.

Advertisement
Advertisement