ఏం జరుగుతుందో చూద్దాం: షిండే | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతుందో చూద్దాం: షిండే

Published Tue, Feb 18 2014 12:05 PM

ఏం జరుగుతుందో చూద్దాం: షిండే - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మధ్య కమల్‌నాథ్‌ తెలిపారు. లోక్సభలో బిల్లుపై చర్చకు ఆటంకాలను తొలగించడంపై స్పీకర్‌ దృష్టిపెడతారని చెప్పారు. బిల్లుకు మద్దతు తెలిపేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తంచేయొచ్చన్నారు. ఓటింగ్‌ ఉంటుందా, లేదా అన్నది సభలోనే తేలుతుందని కమల్నాథ్ అన్నారు.

తెలంగాణ బిల్లు లోక్సభలో ఉంది, ఏం జరుగుతుందో చూద్దామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. కాగా,  ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమైన కమల్నాథ్, షిండే... తెలంగాణ బిల్లుపై చర్చలు జరిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement