న్యూఢిల్లీ: విభజన బిల్లు తిరస్కార తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్ప మెయిలీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాబోదని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు.
తెలంగాణ ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంట్లో పెడతామని వీరప్ప మెయిలీ తెలిపారు. అసెంబ్లీ తెలంగాణ బిల్లు ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ
Published Thu, Jan 30 2014 4:13 PM
Related news
-
బజరంగ్ దళ్ను బ్యాన్ చేయలేం: మొయిలీ
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వార్తల్లోకి ఎక్కింది. తాము అధికారంలోకి వస్తే గనుక బజరంగ్ దళ్ను, పీఎఫ్ఐను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ స్వరం మార్చింది. అలాంటి ప్రతిపాదన ఆచరణకు వీలుపడదంటూ ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం ఉడిపిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బజరంగ్ దళ్ నిషేధంపై ఆయన స్పందించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు బజరంగ్ దళ్ గురించి మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. ఇది అన్ని రాడికల్ గ్రూప్లకు వర్తిస్తుందని చెప్పాం. కానీ, అలా నిషేధించడం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యపడదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, కర్ణాటక ప్ఱభుత్వం బజరంగ్ దళ్ను బ్యాన్ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంపై కర్ణాటక బీజేపీ చీఫ్ డీకే శివకుమార్ మీకు (మీడియాను ఉద్దేశించి..) మరింత స్పష్టత ఇస్తారు. చివరకు సుప్రీం కోర్టు కూడా విద్వేష రాజకీయాలకు ముగింపు ఉండాలని తన తీర్పులో అభిప్రాయపడింది. కాబట్టి.. అలాంటి ప్రతిపాదనేం మేం చేయట్లేదు. కాంగ్రెస్ నేతగా ఈ విషయాన్నే మీకు స్పష్టం చేయదల్చుకున్నా’’ అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిషేధం గురించి స్పష్టమైన వివరణ ఉంది. మైనారిటీ కమ్యూనిటీలతో పాటు ప్రజలందరి మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాలను రగిలించే గ్రూపులను నిషేధించి తీరతామని పేర్కొంది. ఆ లిస్ట్లో బజరంగ్ దళ్, పీఎఫ్ఐ కూడా ఉన్నాయి. దీంతో.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఈ అంశంపై బీజేపీపై భగ్గుమంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా కాంగ్రెస్పై మండిపడ్డారు. ఈ తరుణంలో.. ఇప్పుడు కర్ణాటక ఆ ప్రకటనపై వెనక్కి మళ్లడం గమనార్హం. ఇదీ చదవండి: కర్ణాటక ఎన్నికల్లో ఇదో సిత్రం.. తనకు తానే కిడ్నాప్ చేసుకుని.. -
మీరు ఏ ఎన్నికల్లో గెలిచారు?!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమని గళమెత్తుతున్న జి–23 (గ్రూప్ ఆఫ్ 23) నాయకులపై ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్(68) మండిపడ్డారు. త్యాగాలతోనే సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప అకస్మాత్తుగా ప్రశ్నించడం ద్వారా కాదని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ఇప్పుడున్న స్థానాల్లోకి ఎలా వచ్చారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. జి–23లోని చాలామంది పెద్దలు పార్టీ పదవుల్లో నామినేట్ అయిన వాళ్లేనని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతూ అదే విధానాన్ని(నామినేట్) ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల రణరంగంలో ముందంజలో నిలవాలంటే కాంగ్రెస్కు పెద్ద శస్త్రచికిత్స అవసరమని జి–23 నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మా నాయకుడు పదేళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు నేతలు చేసే ‘అద్భుత వ్యాఖ్యానాల’తో పరిష్కారం దొరకదని సల్మాన్ ఖుర్షీద్ చురక అంటించారు. పార్టీ నేతలంతా కలిసి కూర్చొని చర్చించుకోవాలని, సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలా? వద్దా? అనేది రాహుల్ గాంధీయే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఆయన పార్టీ అధినేత అయినా కాకపోయినా తమ నాయకుడిగా మాత్రం ఉంటారని వెల్లడించారు. సంస్కరణలు, శస్త్రచికిత్స అంటూ కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ లేవనెత్తిన అంశాలపై ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. ‘‘శస్త్రచికిత్స చేస్తానంటే నేను సంతోషిస్తా. కానీ, నా కాలేయం, మూత్రపిండాలు తీసుకుంటానంటే ఎలా? ఎలాంటి శస్త్రచికిత్స చేయాలనుకుంటున్నారో దయచేసి ఎవరైనా చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్టీకి సర్జరీ చేయాల్సిందేనని, అయితే, దానివల్ల సాధించదేమిటో, కోల్పోయేదేమిటో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్జరీ కంటే ముందు ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు అవసరమని తెలిపారు. సమస్య లోతుల్లోకి వెళ్లాలని, దానికి పరిష్కారాన్ని కనిపెట్టాలని అన్నారు. పదవులు వదులుకుంటేనే సంస్కరణలు సాధ్యం సర్జరీ, సంస్కరణలు, ప్రాథమిక మార్పు తీసుకురావడం అంటే ఏమిటో తనకు అర్థం కావడం లేదని సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. వాటి అర్థాలేమిటో తనకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని, వారికి (జి–23 నాయకులు) కీలక పదవులు దక్కాలని కోరుకుంటున్నారేమో తెలియదు. అదే నిజమైతే అది సంస్కరణగానీ, సర్జరీ గానీ కాబోదు. ‘నాకొక›పదవి కావాలి’ అని కోరుకోవడం మాత్రమే అవుతుంది’’ అని తేల్చిచెప్పారు. సంస్కరణ అం టూ మాట్లాడుతున్న నేతలు తొలుత ఇతర నాయకులతో మాట్లాడాలని సూచించారు. వారు తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘పార్టీలో సంస్థాగత ఎన్నికలకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఎన్నికలు జరగాల్సిందే. అయితే, ఏ ఎన్నికల్లో గెలిచి వారు (జి–23 నేతలు) ఇప్పుడున్న స్థానాలను చేరుకున్నారో గుర్తుచేస్తే మాలాంటి వారు సులభంగా అర్థం చేసుకుంటారు. సంస్థాగత ఎన్నికల్లో గెలిచి వారంతా పదవులు చేపట్టారా?’’అని ఖుర్షీద్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. సంస్కరణ అనేది అకస్మాత్తుగా సాధ్యం కాదని, పొందినదాన్ని వదులుకున్నప్పుడే అది సాకారమ వుతుందని తెలిపారు. పార్టీలో మార్పు రావాలని కోరుకున్నప్పుడు త్యాగాలకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు. -
రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్)
‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్న చోట బాల్ పెన్తో గీస్తుండగా చిన్న డౌట్ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా? అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! ఇంకు పెన్ను గానీ, బాల్ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే. కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్ పెన్తో న్యూస్ పేపర్పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. స్క్రీన్ మీద జూమ్లో రాహుల్ బాబు!! అతడి చేతిలో పింగాణీ ప్లేట్ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్ టైమ్ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. ‘‘గుడ్ మార్నింగ్ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే! ‘‘గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. స్పూన్ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్ తీసుకున్నాడు రాహుల్. ఆ టైమ్లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్ బాబూ.. కాంగ్రెస్కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. ‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్ బాబూ..’’ అన్నాను. ‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్షా, నడ్డా మీట్ అయ్యారు. అదే రోజు శరత్ పవార్, ప్రశాంత్ కిశోర్ మీట్ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్. రాహుల్లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. ‘‘సర్జరీ అయినా, సర్జికల్ స్ట్రయిక్స్ అయినా కొంత టైమ్ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. రాహుల్లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు! ‘‘రాహుల్ బాబూ.. నా ముందు టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్ కట్ అయింది. -మాధవ్ శింగరాజు -
వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ అవార్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్కు ఇంగ్లిష్లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్కు ఈ పురస్కారం లభించింది. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది. మొయిలీ, అరుంధతి కాకుండా, ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్ఎస్ భాస్కర్(కొంకణి), హరీశ్ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్ దేవన్(మణిపుర్), రూప్ చంద్ హన్స్దా(సంతాలి), నందకిషోర్(మరాఠీ), మహేశ్చంద్ర గౌతమ్(సంస్కృతం), హుస్సేన్ ఉల్ హక్(ఉర్దూ), అపూర్వ కుమార్సైకియా(అస్సామీ), దివంగత హిదయ్ కౌల్ భారతి(కశ్మీరీ), ధరనింధర్ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు. -
‘మనసు నొప్పించి ఉంటే క్షమించండి’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. సోనియా పార్టీకి తల్లిలాంటివారని.. ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెలిసోతెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామని పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే తాము లేఖ రాశామని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’) కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని.. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. శశి థరూర్, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఏకగ్రీవంగా తీర్మానించడంతో.. పార్టీలో చెలరేగిన ప్రకంపనలు చప్పున చల్లారిపోయాయి.(చదవండి: గాంధీలదే కాంగ్రెస్..!) ఈ పరిణామాల గురించి వీరప్ప మొయిలీ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘‘‘పార్టీ కోసం సోనియాజీ చేసిన త్యాగం గురించి మాకు తెలుసు. అందుకు మేం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. అయితే ఎన్నో ఏళ్లుగా మేం కూడా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టే పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి అధినాయకత్వ దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. అంతేతప్ప సోనియా గాంధీ మనోభావాలను కించపరచుకోవాలనుకోలేదు. ఆమెపై గౌరవం అలాగే ఉంటుంది. అయితే అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం దానిని ఆశించే మేం లేఖ రాశాం. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఆమె మాకు తల్లిలాంటి వారు. తొలుత అధ్యక్షురాలిగా కొనసాగేందుకు నిరాకరించినా తర్వాత ఆమె అంగీకరించారు. ఆమె మార్గదర్శకత్వంలో ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆమె పట్ల మా ప్రేమ తగ్గదు. అయితే మేం రాసిన లేఖ ఎలా లీకైందో తెలియడం లేదు. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అనేకసార్లు ద్రోహం చేసిన వాళ్లే.. పార్టీ విధేయులుగా నటిస్తూ తమ విధేయతనే ప్రశ్నించేలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సీడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా సీనియర్ నాయకుల తీరుపై ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ సీనియర్ నేతలు ఆవేదన చెందారు. ఒకానొక సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి.
Related News by category
-
ఒడిశా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం సోదరి పోటీ!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ లోక్సభ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా మహిళా నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. అంజనీ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె.మయూర్భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పొరు నెలకొంది. ఈ స్థానంలో బీజేపీ నాబా చరణ్ మాఝీని రంగంలోకి దింపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ నాడు విజయం సాధించిన బిశేశ్వర్ తుడు స్థానంలో నాబా చరణ్ మాఝీకి అవకాశం కల్పించింది.ఇదే స్థానం నుంచి సుదమ్ మరాండీ బీజేడీ టికెట్పై పోటీ చేస్తున్నారు. సుదామ్ మరాండి ఒకప్పుడు ఒడిశాలో జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేతగా ఉన్నారు. అయితే ఆ తరువాత అతను బీజేడీలో చేరారు. సుదామ్ మరాండీకి స్థానికంగా ప్రజల మద్దతు ఉందనే మాట వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి జేఎంఎం తరపున అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ లోక్సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది.మయూర్భంజ్ జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది. 2019లో అంజనీ సోరెన్ ఈ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మయూర్భంజ్ లోక్సభ స్థానంలో గిరిజనుల సంఖ్య అత్యధికం. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. జేఎంఎంతో పొత్తు కారణంగా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. -
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్ను సందర్శించిన తర్వాతే చార్ధామ్కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
‘మీరు ఆ్రఫ్టాల్ జెండా కూలీలు మాత్రమే. మా పక్కన నిలబడే అర్హత మీకెక్కడిది. కిందకు దిగండి.. మీరు మా భ‘జనసేన’లా ఉండాలే తప్ప.. పక్కన ఉండాలని అనుకోవద్దు..’ ఇదీ భీమిలిలో జెండా మోస్తున్న గాజుగ్లాసు కార్యకర్తలకు గంటా శ్రీనివాసరావు బ్యాచ్ చేతుల్లో అడగడుగునా ఎదురవుతున్న పరాభవం. సాక్షి, విశాఖపట్నం : పొత్తుల్లో భాగంగా భీమిలి సీటును టీడీపీ చేతుల్లో పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు.. అసలు జనసేన తమ కూటమి కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నేతలను పక్కన పెట్టేశారు. పొత్తు ఉందని ప్రచారానికి వెళ్తున్న ఆ పార్టీ నేతలకు.. గంటా బ్యాచ్ చేతుల్లో ప్రతి రోజూ ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. గాజు గ్లాసుతో జెండా కనిపిస్తే చాలు.. గంటా బ్యాచ్ వారిపై విరుచుకుపడుతోంది. వారి తప్పు లేకపోయినా.. వారితో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి సమాధానం ఇస్తే చాలు టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారం రోజుల క్రితం మధురవాడలో టీడీపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జనసేన శ్రేణులకు దెబ్బలే మిగిలాయి. జీవీఎంసీ 6వ వార్డులో గంటా, భరత్ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. బైక్ ర్యాలీగా వచ్చిన వారిలో టీడీపీ, జనసేన కార్యకర్తల బైక్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఇదే అదనుగా భావించిన గంటా బ్యాచ్.. అక్కడ గాజు గ్లాస్ జెండా పట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరిపైనా చేయిచేసుకున్నారు. దొరికిన జనసేన కార్యకర్తను దొరికినట్లే చితక్కొట్టారు. చివరికి తమని జనసేన కార్యకర్తలు గాయపరిచారంటూ టీడీపీ శ్రేణులు పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గ్లాస్ బ్యాచ్ అవాక్కైంది. ప్రచారానికని పిలిచి.. కొట్టారంటూ పంచకర్ల సందీప్ వద్ద వాపోయినా.. తనకేం సంబంధం లేదన్నట్లుగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. రథం ఎక్కే అర్హత మీకెక్కడిదిరా..? తాజాగా మరో చేదు అనుభవం గ్లాసు కార్యకర్తలకు ఎదురైంది. భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో గంటా శ్రీనివాసరావు ప్రచారం సందర్భంగా యాతపేటలో మంగళవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. అప్పటికే ప్రచార రథంపై జనసేన మండల ఉపాధ్యక్షుడు ఎరుసు సూర్రెడ్డి తన అనుచరులతో కలిసి ఉన్నాడు. ఇది చూసిన టీడీపీ నేతలు డీఎఎన్ రాజు, కోరాడ రమణ తదితరులు సూర్రెడ్డితో పాటు మిగిలిన జనసేన శ్రేణుల్ని కిందకి దిగండి అని హుకుం జారీ చేశారు. మేం ప్రచారం చేస్తామని జెండాలు పైకెత్తడంతో.. అసహనానికి గురైన గంటా వర్గం.. గ్లాసు సేనని ప్రచార రథం నుంచి కిందకు లాగేశారు. అసలు మిమ్మల్ని ఎవడ్రా బండి ఎక్కించింది. ఎక్కించిన వాడికీ బుద్ధిలేదు.. ఎక్కిన మీకు బుద్ధి లేదు.. మీకంత అర్హతెక్కడిదిరా.. పొండిరా ఇక్కడి నుంచి.. కిందకెళ్లి.. మీ జెండాలు ఊపేసుకోండి.. అంటూ దూషించడంతో.. అందరి ముందు తీవ్ర అవమాన భారంతో వెనుదిరిగారు. ఈ వ్యవహారాన్ని సందీప్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గంటాకు సందీప్ అమ్ముడు పోయారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు తమకు జరిగిన అవమానం గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సందీప్ కూడా గంటా అనచరుడిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.అడుగడుగునా అవమానాలు భరించాలా..? పవన్ కల్యాణేమో పొత్తులో ఉన్నామంటారు.. వీళ్లేమో జెండా కూలీలని అవమానిస్తున్నారు.. ఒక పార్టీలో ఉండి కూడా ఎందుకీ బతుకులు అన్నట్లుగా గాజుగ్లాసు సేన కుమిలిపోతోంది. అడుగడుగునా అవమానాలు పడుతూ, వాళ్ల చేతిలో దెబ్బలు తింటూ.. తిట్లు తిడుతుంటే పడుతూ.. టీడీపీ జెండాలు మోయడం తమకు అవసరమా అంటూ శ్రేణులు.. తమ అధినాయకత్వాన్ని ప్రశి్నస్తున్నారు. ఇప్పుడే ఇలా అవమానిస్తూ.. తన్ని తరిమేస్తుంటే.. రేపు పొరపాటున గంటా గెలిస్తే.. తమ ఆస్తులన్నీ లాక్కొని.. ఊరి నుంచి తరిమేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వాపోతున్నారు. ఇరువర్గాల మధ్య కొట్లాట తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలసలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో అక్కరమాని ఎర్రయ్య, కొంగరాని సూరిబాబు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం గంటా ప్రచార ర్యాలీలో జనసేన నాయకులను టీడీపీ నాయకులు ప్రచార రథం నుంచి కిందకు లాగివేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని వైఎస్సార్సీపీ నాయకులే వైరల్ చేశారని ఆరోపిస్తూ ఎక్కువ సంఖ్యలో టీడీపీ నాయకులు అక్కరమాని ఎర్రయ్య కుమారుడు రమణ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో ఎర్రయ్య తీవ్రంగా గాయపడటంతో 108లో కేజీహెచ్కు తరలించారు. ఈ దాడులలో మరో వర్గానికి చెందిన కొంగరాని సూరిబాబు గాయపడ్డాడు -
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
న్యూఢిల్లీ, సాక్షి: జార్ఖండ్ కాంగ్రెస్ ఖాతాను ‘ఎక్స్’ (ట్విటర్) నిలిపివేసింది. చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా ఎక్స్ ఈ చర్య తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎస్ఐ నివేదించింది. ఈ హ్యాండిల్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన 'డీప్ఫేక్ మార్ఫ్డ్ వీడియో' పోస్ట్ చేసిన తర్వాత ఖాతాను ‘ఎక్స్’ నిలిపివేసింది.మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బుధవారం తెల్లవారుజామున సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నోటీసు జారీ చేసింది. మే 2న సెల్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. ‘ఢిల్లీ పోలీసుల నుండి నోటీసు అందింది. కానీ నాకు ఎందుకు నోటీసు ఇచ్చారో అర్థం కాలేదు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదు’ అని ఠాకూర్ స్పందించినట్లుగా పీటీఐ పేర్కొంది. -
లిక్కర్ కేసు: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై ఉత్కంఠ కొనసాగనుంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో ఆమె వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును గురువారం ఉదయం వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక స్థానం. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరఫున వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ సీబీఐ అరెస్ట్ వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్పై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకేరోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు. ఇక.. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.ఈడీ బెయిల్ పిటిషన్పై వాడీవేడి వాదనలుఇక.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాదనల అనంతరం కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్పై వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. మే 6వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది. విచారణ సందర్భంగా.. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని... అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నాు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
మహాసేన రాజేష్ కు ఘోర అవమానం
కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు
చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement