తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ | Sakshi
Sakshi News home page

తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ

Published Thu, Jan 30 2014 4:13 PM

తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ - Sakshi

న్యూఢిల్లీ: విభజన బిల్లు తిరస్కార తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్ప మెయిలీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాబోదని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు.

తెలంగాణ ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంట్‌లో పెడతామని వీరప్ప మెయిలీ తెలిపారు. అసెంబ్లీ తెలంగాణ బిల్లు ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement