కోయంబత్తూరు: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తమకు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఎండీ ఎం.భగవంత రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం తమ వ్యాపారంపై తీవ్రంగా పడిందని తెలిపారు. బ్యాంకును వృద్ధి బాట పట్టించేందుకు ఇతర రాష్ట్రాలు, ఎంఎస్ఎంఈ విభాగంపై దృష్టి పెట్టామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల 60కిపైగా శాఖలను తెరిచామన్నారు. ‘2013-14ను ఎంఎస్ఎంఈ సంవత్సరంగా పరిగణిస్తున్నాం. ఎస్ఎంఈకి రూ.5,500 కోట్ల రుణా లు మంజూరు చేశాం. ఈ రంగానికి మొత్తం రూ.9 వేల కోట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీన ప్రక్రియపైనా ఉద్యమ తాకిడి పడిందన్నారు. కొన్ని శాఖలు కొద్ది రోజుల పాటు మూసివేయాల్సి వచ్చిం దని, తద్వారా వ్యాపారంపై, నిరర్థక ఆస్తులపై ప్రభా వం చూపిందని పేర్కొన్నారు. నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తున్న రూ.700 కోట్ల రుణాలను కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణకు సిఫార్సు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచే..
ఎస్బీహెచ్ ఏటా చేస్తున్న రూ.2.2 లక్షల కోట్ల వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా రూ.1 లక్ష కోట్లకుపైగా సమకూరుతోంది. బ్యాంకుకు తెలంగాణలో 550, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 450 శాఖలున్నాయి. తెలంగాణ నుంచి రూ.65 వేల కోట్ల వ్యాపారం నమోదవుతోంది. శాఖల మూసివే త కొనసాగడంతో వ్యాపారం నష్టపోయాం అని భగవంతరావు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 20%, అడ్వాన్సుల్లో 18% వృద్ధి లక్ష్యంగా విధించుకున్నప్పటికీ, ఈ రెండు విభాగాల్లో డిసెం బరు నాటికి 14.5% వృద్ధి మాత్రమే నమోదయ్యేట్టు ఉందని చెప్పారు.
ప్రశ్నార్థకంగా ఆంధ్రప్రదేశ్!
Published Tue, Jan 14 2014 12:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement