రావి నది మీదుగా భారత్లోకి ఉగ్రవాదులు
15 కి.మీ. రోడ్డుపై దర్జాగా నడుచుకుంటూ వచ్చారు
గురుదాస్పూర్/న్యూఢిల్లీ: పంజాబ్లో ఉగ్రదాడి చేసి ఏడుగురిని బలితీసుకున్న ముగ్గురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాయి. జూలై 26-27లలో ముగ్గురు సాయుధులైన టైస్టులు రావి నదిని దాటుకుని అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పఠాన్కోట్లోని బమియాల్ గ్రామం మీదుగా ఆదివారం రాత్రి వారు దేశంలోకి చొరబడినట్లు వెల్లడైంది. ఉగ్రవాదులు ఉపయోగించిన రెండు జీపీఎస్ పరికరాలను విశ్లేషించగా ఈ ముగ్గురు సాయుధులు రోడ్డుపై నడుస్తూ వచ్చినట్లు తేలింది. ఈ జీపీఎస్ పరికరాల్లో వాళ్లు ప్రయాణించాల్సిన మార్గాలు.. ఛేదించాల్సిన లక్ష్యాలు కూడా స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. మరింత స్పష్టత కోసం వీటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. టైస్టులు రావి నదిని దాటి బామియాల్ గ్రామంలో ప్రవేశించిన ప్రాంతంలో భద్రత పటిష్టంగా లేదని సైనిక వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా అమృత్సర్-జమ్ము హైవేపై వారు నడుచుకుంటూ రావటం గమనార్హం. పంజాబ్ పోలీస్ చీఫ్ సుమేధ్సింగ్ సైనీ చెప్పిన వివరాల ప్రకారం టైస్టులు అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ధుస్సీ బంధ్(రావి నది)ని చొరబాటుకు ఎంచుకున్నారు. సరిహద్దులోకి ప్రవేశించగానే అక్కడి రైల్వే ట్రాక్పై బాంబులు అమర్చి దీనానగర్కు చేరుకున్నారు. భారత్లోకి ప్రవేశించిన తరువాత 15 కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారు. దీనానగర్ చేరుకున్నాక ఒక పౌరుడి దగ్గరి నుంచి కారు దొంగిలించి, ఆ కారులోనే దీనానగర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు. జీపీఎస్ పరికరాల విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్తో పాటు, రైల్వే ట్రాక్, ఎస్ఎస్పీ, డిప్యూటీ కమిషనర్, గుర్దాస్పూర్లోని ఆర్మీ యూనిట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక జీపీఎస్ పరికరంలో తలవండీ పాయింట్, పర్మానంద్ గ్రామం, దీనానగర్లు టార్గెట్లుగా కనిపిస్తే, మరో జీపీఎస్ పరికరం గురుదాస్పూర్ సివిల్ లైన్స్ను టార్గెట్గా చూపించిందని సైనీ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మొత్తం 11 ఉపయోగించని బాంబులను స్వాధీనం చేసుకుని వాటిలో అయిదింటిని నిర్వీర్యం చేసినట్లు సైనీ వివరించారు. మూడు ఏకే-47 తుపాకులు, 17 మ్యాగజైన్లు, 55 క్యాటరిడ్జ్లు, ఒక రాకెట్ లాంచర్, మూడు చేతి గ్రెనేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రాత్రి కనిపించే పరికరం, 200 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని సైనీ తెలిపారు.
ఉగ్రవాదులకు కలిసొచ్చిన రావి
పంజాబ్లోకి చొరబడ్డానికి రావి నది ఉగ్రవాదులకు బాగా కలిసివచ్చింది టైస్టులు రావి నదికి సంబంధించి ఒక కాలువ ద్వారా భారత్లోకి ప్రవేశించిన తరువాతే తమ దగ్గరున్న జీపీఎస్ పరికరాలను ఆన్ చేశారు. సీసీటీవీ వీడియో..దీనానగర్ పట్టణంలోనికి ఉగ్రవాదులు ప్రవేశించటానికి ముందు తారాగఢ్లో ఓ దుకాణదారు తన దుకాణంపై ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజిలోనూ ఉగ్రవాదుల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. 14 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తెల్లవారుఝామున 4:55గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా రికార్డయింది.
ముష్కరులు పాక్ నుంచే వచ్చారు
Published Wed, Jul 29 2015 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement