బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి; రూ. 2 లక్షల దోపిడీ | Sakshi
Sakshi News home page

బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి; రూ. 2 లక్షల దోపిడీ

Published Thu, Feb 16 2017 1:11 PM

Terrorists flee after looting more than 2 lakh rupees from a J&K Bank branch

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం షోపియన్ జిల్లాలో జమ్ము కశ్మీర్ బ్యాంకు బ్రాంచిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రెండు లక్షల రూపాయలకు పైగా నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.

బ్యాంకు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. భద్రత దళాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. గత నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు కొన్ని చోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement