థరూర్ ను చుట్టుముట్టిన టీవీ రిపోర్టర్లు | Sakshi
Sakshi News home page

థరూర్ ను చుట్టుముట్టిన టీవీ రిపోర్టర్లు

Published Wed, Jan 14 2015 10:43 PM

థరూర్ ను చుట్టుముట్టిన టీవీ రిపోర్టర్లు

కోల్ కతా: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు విలేకరుల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. కోల్ కతా సాహిత్య వేడుక(ఏకేఎల్ఎఫ్)లో పాల్గొనేందుకు బుధవారం ఇక్కడకు వచ్చిన థరూర్ ను వార్తా చానళ్ల విలేకరులు చుట్టుముట్టారు.

సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసుపై ప్రశ్నలు గుప్పించారు. సమాధానం ఇచ్చేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో ఒకానొక దశ రిపోర్టర్లు, కెమెరామన్లు ఆయనను తోసేశారు. భద్రతా సిబ్బంది ఎంతో శ్రమించి విలేకరుల మధ్య నుంచి ఆయనను బయటకు తీసుకువచ్చారు.

Advertisement
Advertisement