బీజింగ్: వారిద్దరు ప్రాణ మిత్రులు. ఒకరికి ఒకరు తోడూ నీడ. వారిలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి కళ్లు. రెండో వ్యక్తి మొదటి వ్యక్తికి చేతులు. ఎందుకంటే వారిలో ఒకరికి కళ్లు లేవు, మరొకరికి చేతులు లేవు. ఇద్దరు చేతులూ కళ్లు కలిపి మహా యజ్ఞాన్ని చేపట్టారు. కన్ను పొడుచుకున్న చె ట్టూ పుట్ట కనిపించని నై బారిన ఎనిమిది హెక్టార్ల నేలలో చెట్లు నాటి పచ్చదనం పరిచే మహత్తర యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎనిమిది హెక్టార్ల స్థలంలో పదివేల మొక్కలు నాటారు. పచ్చదనం చూసి పక్షులు రావడం ప్రారంభమైంది. వాటి కిలకిల...రావాలే ప్రోత్సాహంగా వారు తమ యజ్ఞాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారు ఈ యజ్ఞాన్ని ప్రారంభించి 13 ఏళ్లు. తాము చేపట్టిన యజ్ఞంలో ఇంకా సగంపైగా మిగిలే ఉందని, తుదిశ్వాస విడిచే వరకు తాము నిరంతరంగా ఈ పనిలోనే నిమగ్నమవుతామని వారు చెబుతున్నారు. తాము సైతం ప్రపంచ పర్యావరణానికి తోడై నిలుస్తున్నందుకు అమితానందంగా ఉందని ఓ ఇంగ్లీష్ టీవీ టాక్లో తెలిపారు.
వారిద్దరు చైనాలోని యోలి అనే కుగ్రామానికి చెందిన వారు. వారిలో ఓ ఏదాది పెద్దవాడైన జియా హాగ్జియాకు 54 ఏళ్లు. రెండో వ్యక్తి 53 ఏళ్ల జియా వెంగీ. హాగ్జియాకి రెండు కళ్లు లేవు. చూపు మచ్చుకైనా కనిపించదు. పుట్టికతోనే ఓ కన్ను గుడ్డివాడైన హాగ్జియాకు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా 2000 సంవత్సరంలో సంభవించిన ఓ ప్రమాదంలో రెందో కన్నుకూడా పోయింది. వెంగికి విద్యుత్ షాక్ వల్ల చిన్నప్పుడే రెండు చేతులు తీసేయాల్సి వచ్చింది. వారిద్దరు బాల్య మిత్రులు. ఇద్దరికి కుటుంబాలున్నాయి. సంపాదన పెద్దగా లేదు. ఇటు కుటుంబానికి, సమాజంలోని న లుగురికి ఉపయోగపడే పని చేయాలనుకున్నారు. వారి కుగ్రామం చుట్టుపక్కల కనుచూపు మేరలో వారికి ఎక్కడా ఓ చెట్టు కూడా కనిపించలేదు. మనిషికి తోడు నీడగా నిలిచే చెట్ల పెంపకం పట్ల ఎందుకు శ్రద్ధ చూపడం లేదని వారెళ్లి స్థానిక పంచాయతీని ప్రశ్నించారు. బంజరు భూముల్లో చెట్లేమి పెంచుతాం, అయినా అవి పెంచడానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయని పంచాయతీ అధికారులు సమాధానం ఇచ్చారు. తమకు లీజుకు స్థలం ఇస్తే తాము పెంచుతామని ప్రాణ మిత్రులు ఒక్క మాటగా చెప్పారు.
ఎనిమిది హెక్టార్ల బంజరు భూమిని గ్రామ పంచాయతీ అధికారులు వారికి నామమాత్రం రేటుపై లీజుకిచ్చారు. అంతే ఒకరు పార, ఒకరు గుణపం పట్టుకొని ఆ బంజరు భూమికి వెళ్లడం మొదలు పెట్టారు. మధ్యలో అడ్డంగా పారే ఓ కాల్వ వద్దకు వచ్చినప్పుడు చేతులు లేని వెంగీ కళ్లులేని హాగ్జియాను భుజానెత్తుకుని కాల్వ దాటిస్తాడు. ఆ తర్వాత కొన్నేళ్లుగా వారు పడుతున్న కష్టాన్ని చూసి పంచాయతీ అధికారులు, లీజు రుసుంను మాఫీ చేయడమే కాకుండా వారి శ్రమకు కూలికింద కొంత సొమ్ము చెల్లిస్తూ వచ్చారు. అలా వచ్చిన సొమ్మును ప్రాణ మిత్రులు వృధా చేయకుండా తొలుత మొక్కలు కొనేందుకు ఉపయోగించారు. వీరి కృషికి కదిలిపోయిన గ్రామస్థులు పట్టణంలోని మార్కెట్కు వెళ్లినప్పుడల్లా తమకు తోచిన మొక్కలు కొనుక్కొచ్చి ఇస్తున్నారు. దాంతో కూలి కింద తమకందుతున్న కొంత సొమ్మును తమ కుటుంబాలకే ఇస్తూ కుటుంబ పోషణకు కూడా తోడ్పడుతున్నారు.
ఒకరు కళ్లు... మరొకరు చేతులు
Published Sat, Apr 18 2015 4:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement