మహబూబ్నగర్లో ఘటన
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ బాలుడి బంధువుల ఆందోళన
మహబూబ్నగర్ క్రైం : వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులే ఓ బాలుడి ప్రాణాలతో చెలగాటమాడారు. చని పోయిన బాలుడికి చికిత్స చేస్తున్నామంటూ నమ్మబలికారు. చివరకు వ్యవహారం బెడిసికొట్టడంతో తెల్లమొఖం వేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. హన్వాడ మండలం రామన్నపల్లికి చెందిన ఆంజనేయులు తన కుమారుడు హరిప్రసాద్(1) జ్వరం, మూర్ఛతో ఇబ్బం ది పడుతున్నాడని సెప్టెంబర్ 21వ తేదీన నవోదయ ఆసుపత్రిలో చేర్పించారు.
తొమ్మిది రోజుల నుంచి చికిత్స చేస్తున్న వైద్యులు.. మీ బాబు ఆరోగ్యం క్షేమంగా ఉందని త్వరలో కోలుకుంటాడని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యం రూ.92 వేలు ఫీజు రూపంలో వసూలు చేసింది. ఉదయం 11 గంటల సమయంలో బాబు చనిపోయాడని ఓసారి.. అత్యవసర చికిత్స చేస్తున్నామంటూ మూడు గంటల పాటు హైడ్రామా నడిపారు. అయితే, కోలుకున్న బాబుకు వెంటిలేటర్పై చికిత్స చేయడం ఏమిటని అనుమానం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు.. వైద్యులను నిలదీస్తే వారు ‘చావు’కబురు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాలుడు చనిపోయాడని ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు
రామన్నపల్లికి చెందిన హరిప్రసాద్ కుమారుడు 9 రోజుల నుంచి మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జ్వరం, మూర్ఛ ఒకేసారి రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఇందులో నవోదయ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు.
- ఖలీద్, నవోదయ ఆసుపత్రి నిర్వాహకుడు
చనిపోయిన బాలుడికి చికిత్స!
Published Thu, Oct 1 2015 8:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement