టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Fri, Jul 21 2017 5:26 PM

today news roundup

           <<<<<<<<<<<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
భారత్‌, చైనాతో పాటు పది దేశాల్లో హెచ్‌ఐవీ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుందని ఐకరాజ్య సమితి(యూఎన్) తమ నివేదికలో పేర్కొంది.
 
ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసిన పాపానికి పోలీసుల కాల్పుల్లో తమ దేశ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాదంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ విచారం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలో ఓ ఆరవై ఏళ్ల కిందటి రెడ్‌ వైన్‌ మద్యం బాటిల్‌ భారీ మొత్తాన్ని రాబట్టింది. పెన్‌పోల్డ్స్‌ కంపెనీకి చెందిన 1951నాటి ఈ బాటిల్‌ ఆస్ట్రేలియాలో దాదాపు రూ.26,26,905(40,825 డాలర్ల)కు అమ్ముడుపోయింది.
 
 
               <<<<<<<<<<<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
పాత పద్ధతులు, పాత వ్యవస్థలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పాత సంప్రదాయానికి కూడా స్వస్థి పలికే అవకాశం కనిపిస్తోంది.
 
ఇరవైనాలుగు గంటల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ పార్టీ నేత శంకర్‌సిన్హా వాఘెలా అనుకున్నంత పనిచేశారు. 
 
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మూడో దేశం (థర్డ్‌ పార్టీ) మధ్యవర్తిత్వం అవసరమని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు.
 
కేరళలో ఓ కాంగ్రెస్‌ శాసనసభ సభ్యుడిపై అత్యాచారం కేసు నమోదైంది. కోవలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ(51) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ రికార్డు సృష్టించగా.. పరాజయం పాలైన ప్రతిపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ యాభై ఏళ్ల చరిత్రను తిరగరాశారు. 
 
 
                           <<<<<<<<<<<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
తెలుగుదేశం నేతలకు పొరపాట్లు చేయడం, తరువాత నాలుక్కరుచుకోవడం అలవాటే. సాక్షాత్తు పార్టీ అధినేతే గతంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ సన్మాన సభలో ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తానని చెప్పారు.
 
 కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ్‌ తెలిపారు.
 
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
 
 
                           <<<<<<<<<<<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
అద్భుత ప్రదర్శనతో మహిళా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరి ఆనందంలో ఉన్న భారత జట్టు సభ్యులను కెప్టెన్ మిథాలీ రాజ్ హెచ్చరించింది.
 
 
భారత క్రికెట్ లో ద వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. 
 
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయం...  సెమీఫైనల్లో ఆద్యంతం అద్భుతంగా ఆడిన మిథాలీ సేన ఫైనల్లోకి ప్రవేశించింది. 
 
ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్కు చివరి నిమిషంలో చోటు దక్కిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ అయిన మురళీ విజయ్ గాయం ఇంకా నయం కాలేకపోవడంతో శిఖర్ ధావన్ కు జట్టులో చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. 

                          <<<<<<<<<<<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  మోస్ట్ ఎవైటెడ్ జియో ఫోన్..అద్భుత ఫీచర్లతో
  ఎప్పటినుంచో ఊరిస్తున్న జియో ఫీచర్ ఫోన్ను రిలయన్స్ లాంచ్ చేసింది.

  ముకేశ్ అంబానీ భావోద్వేగం
  బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వార్షిక సాధారణ వార్షిక సమావేశంలో తండ్రి, షౌండర్ చైర్మన్ ధీరూబాయ్      అంబానీని గుర్తు చేసుకుని  భావోద్వేగానికి గురయ్యారు.

  జియో ఫోన్ ఎఫెక్ట్: మీడియా, టెలికాం షేర్ల పతనం
  రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సందర్భంగా జియో ఫోన్ ప్రకటన తో మీడియా షేర్లు, టెలికాం షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.


సోనీ నుంచి మరో కొత్త ఫోన్: ఫీచర్లివే...

ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలోనే లాంచ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ, మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

                     <<<<<<<<<<<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

రకుల్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!
టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.
 

మెగా వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, చాలా కాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 

బిగ్ బాస్‌లో నేనా..? టైం లేదు: అనసూయ
బిగ్‌బాస్‌ షో కు టైం లేదన్నహాట్‌ యాంకర్‌.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985లో నటిస్తున్న..

పాపను దత్తత తీసుకున్న సన్నీ దంపతులు
బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌, డానియెల్‌ వెబర్‌ దంపతులు పాపను దత్తత తీసుకున్నారు. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement