టుడే అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Sun, Oct 18 2015 8:48 AM

Today updates

*నేడు బీహార్లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు.
*నేడు నడిగర్ సంఘం ఎన్నికలు. బరిలో శరత్ కుమార్, విశాల్ జట్లు
*నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు.
*నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు.
*నేటి సాయంత్రం 5.30కి హైదరాబాద్లో తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ను ఆహ్వానించనున్న చంద్రబాబు.
*నేడు భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్.  మధ్యాహ్నం 1.30 గంటలకు రాజ్ కోట్లో మ్యాచ్ ప్రారంభం.
*ఐదో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవములు.. ఉదయం 9.00 గంటలకు మోహిని అవతారంలో స్వామి వారు దర్శనం... రాత్రి 8.00 గంటలకు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వనున్న స్వామివారు.
*భద్రాచలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు... ధాన్యలక్ష్మీ రూపంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.
*విజయవాడలో ఆరోరోజు శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు... లలిత త్రిపురసుందరీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం
*శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవములు... కాత్యాయని రూపంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement