సెలూన్లకు టర్కీ మగాళ్ల పరుగులు | Sakshi
Sakshi News home page

సెలూన్లకు టర్కీ మగాళ్ల పరుగులు

Published Fri, Aug 14 2015 10:10 AM

సెలూన్లకు టర్కీ మగాళ్ల పరుగులు

అంకారా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారనే భయంతో టర్కీలోని మగవాళ్లంతా తమ గడ్డాలను తీయించుకుంటున్నారు. ఆగస్టు 7న పెద్ద గడ్డాలతో ఉన్న 19 మంది ఐఎస్‌ఐఎస్  తీవ్రవాదులు ఎగీనా రాష్ట్రం మనీసాలో పట్టుబడ్డారు. గడ్డాలు పెంచుకుంటున్న వారిని ఉగ్రవాదులుగా ప్రజలు అనుమానిస్తున్నారని, దీంతో వీరంతా సెలూన్లకు వస్తున్నారని అక్కడి హెయిర్ డ్రెస్సెర్స్ అసోసియేషన్ తెలిపింది. గతంలో ఇక్కడి వారంతా కొత్త స్టైల్ కోసమని సుదీర్ఘకాలంగా గడ్డాలు పెంచేవారని, దీనివల్ల తమ సెలూన్ల వ్యాపారాలు సన్నగిల్లాయని  వివరించింది.

Advertisement
Advertisement