ఇద్దరు హీరోలు.. ఇద్దరూ కుర్రాళ్లే.. కేవలం వాళ్లిద్దరే కలిసి అనేకమంది సైనికులను రక్షించారు. బీఎస్ఎఫ్ దళానికి చెందిన కానిస్టేబుల్ శుభేందురాయ్, రాకీ.. వీళ్లిద్దరు చూపించిన అసమాన ధైర్య సాహసాల వల్లే అనేకమంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఆగాయి. ఉగ్రవాదుల్లో ఒకడు అక్కడికక్కడే హతం కాగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడు. బుధవారం నాడు శుభేందురాయ్ 30 మంది సిబ్బందితో కూడిన బస్సు నడుపుతున్నాడు. అంతలో.. ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ల దగ్గర భారీస్థాయిలో ఆయుధాలున్నాయి.
ఒకడు కొండమీద పొజిషన్ తీసుకుని ఫైరింగ్ మొదలుపెట్టగా, రెండోవాడు బస్సును ఆపి ముందునుంచి కాల్చాడు. శుభేందురాయ్ గాయపడ్డాడు గానీ, ఉగ్రవాది నోమన్ బస్సులోకి రాకుండా ఆపాడు. డోరువద్దే వేలాడుతూ.. ఉగ్రవాదిని ఆపేశాడు. దాంతో నోమన్ బస్సు చుట్టూ తిరుగుతూ అన్నివైపులా కాలుస్తూ రెండోవైపు నుంచి బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పుడు బస్సు ముందుసీట్లో కూర్చున్న కానిస్టేబుల్ రాకీ లేచాడు. తన వద్ద ఉన్న ఇన్సాస్ రైఫిల్తో నోమన్ను ఎడా పెడా కాల్చిపారేశాడు. ఆ దెబ్బకు మ్యాగజైన్లో ఉన్న మొత్తం 40 బుల్లెట్లూ ఖాళీ అయిపోయాయి. నోమన్ చచ్చిపోతూ.. ఓ గ్రెనేడ్ను బస్సు డోరు వద్ద వదిలేశాడు. ఈలోపు అతడు తన ఏకే47తో కాల్చడంతో కానిస్టేబుళ్లు శుభేందు రాయ్, రాకీ ఇద్దరూ మరణించారు.
అయితేనేం.. బస్సులో ఉన్న మొత్తం జవాన్లందరి ప్రాణాలూ కాపాడారు. ఆ ఉగ్రవాదులే లోనికి వచ్చి ఉంటే.. తమవద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో మొత్తం అందరినీ హతమార్చి ఉండేవాళ్లేమో! మరో జవాను కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇదంతా చూసిన నావేద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ అక్కడినుంచి పారిపోయాడు. కానీ, అతడిని గ్రామస్థులు పట్టుకుని భద్రతా దళాలకు అప్పగించారు. కసబ్ తర్వాత సజీవంగా దొరికిన ఏకైక పాక్ ఉగ్రవాది ఇతడే. అయితే అతడు తమ దేశస్థుడు కాడని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇద్దరు కుర్ర హీరోలు.. కుమ్మేశారు
Published Thu, Aug 6 2015 4:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement