న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం రోజే విపక్షాల ఆగ్రహ జ్వాలల్లో పడ్డాయి. కొన్ని తీర్మానాల తర్వాత లోక్ సభ వాయిదా పడగా.. రాజ్యసభలో మాత్రం లలిత్ మోదీ వీసా వ్యవహారం దుమారం రేపింది. రాజ్యసభను దద్దరిల్లేలా చేసింది. విపక్షాలన్నీ స్పీకర్ పోడియం చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. ప్లకార్డులు, పోస్టర్లతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లలత్ మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్నారని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ లలిత్ మోదీ వ్యవహారాన్ని లేవనెత్తారు. లలిత్ మోదీ కుంభకోణాన్ని తొలిసారి గుర్తించింది ఇంగ్లాండ్ అని చెప్పారు.
భార్య అనారోగ్యం పేరిట లలిత్ మోదీ విదేశాల్లో తిరుగుతున్నారని, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్న ఓ వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని, అక్కడ నుంచి భారత్కు ఎందుకు రప్పించడం లేదని నిలదీశారు. పది నెలలు గడుస్తున్నా లలిత్ మోదీని అరెస్టు చేయకపోవడానికి కారణాలేమిటో ప్రధాని చెప్పాలని ప్రశ్నించారు. ఆయన విదేశాలకు వెళ్లేందుకు మీ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించినా వారిపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వాలు మారుతుండొచ్చుగానీ, చట్టాలు మారవు కదా అని ప్రశ్నించారు.
లలిత్ మోదీకి కావాలనే ఎన్డీయే సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందని అని ఆనంద్ శర్మ ఆరోపించారు. దీనికి తోడు కాంగ్రెస్ నేతలు వీహెచ్లాంటివారు కూడా ఎన్డీయేపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లలిత్ మోదీ వ్యవహారంపై చర్చించాలని, ఆయనను అరెస్టు చేయాలని, లలిత్ కు సహకరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్తో తమ ఎదురుగా ఉన్న బల్లలు చరుస్తూ కేకలు వేశారు. దీంతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కలగజేసుకున్నారు. లలిత్ మోదీ వీసా వివాదంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పారు. తమ నేతలెవరూ ఏ తప్పూ చేయలేదని ఆయన చెప్పే యత్నం చేసినా వినకపోవడంతో రాజ్యసభ 12గంటల వరకు వాయిదా పడింది.
తొలిరోజే దద్దరిల్లిన రాజ్యసభ
Published Tue, Jul 21 2015 11:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement