కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ఎవరేమన్నా లెక్కచేయకుండా తన మాట నెగ్గించుకుంది. తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రం పక్కాప్రణాళిక అమలు చేసింది. బిల్లును ఎప్పుడు పెడతామనేది ముందుగా చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఇవాళ, రేపు అంటూ అంటూ నెట్టుకొచ్చిన యూపీఏ సర్కారు అనూహ్యంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. సీమాంధ్ర ఎంపీలు, ప్రధాన ప్రతిక్షం గట్టిగా వ్యతిరేకించినా లెక్కచేయకుండా మొండిగా వ్యవహరించి బిల్లును సభలో పెట్టింది. సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహం అమలు చేసింది. ముందుగానే పథకం రచించి వారిని అడ్డుకుంది.
లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో సుశీల్ కుమార్ షిండేకు రక్షణగా 25 మంది ఎంపీలు నిలిచారు. సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునేందుకు మిగతా ఎంపీలను పెద్ద సంఖ్యలో మోహరించింది. బిల్లుతో సంబంధం లేని ఎంపీలను కూడా స్పీకర్ పోడియం వద్దకు పంపించి సీమాంధ్ర ఎంపీలు అక్కడకు రాకుండా జాగ్రత్త పడింది. సభలో ఘర్షణ వాతావరణం ఉన్నా వెనక్కి తగ్గకుండా బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళ్లింది. ప్రభుత్వ మొండి వైఖరితో సీమాంధ్ర ఎంపీలు తీవ్రచర్యలకు దిగారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆందోళనలకు దిగారు.
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో మిరియాల పొడి చల్లి సంచలనం సృష్టించారు. దీంతో సభలో ఒక్కసారిగా అయోమయ పరిస్థితి తలెత్తింది. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పార్లమెంటరీ సెక్రటరీ మైకు విరిచేసి బీభత్సం సృష్టించారు. మిగతా ఎంపీలు బల్లపైకి ఎక్కి ఆందోళనలు చేశారు. సీమాంధ్ర ఎంపీలను తెలంగాణ సభ్యులు అడ్డుకోవడంతో లోక్సభ రణరంగాన్ని తలపించింది. చేసింతా చేసి తమకేమీ తెలియనట్టుగా వ్యవహరించింది. 18 మంది ఎంపీలను సభను నుంచి ఐదు రోజుల పాటు బహిష్కరించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా యూపీఏ సర్కారు పట్టించుకోవడం లేదు.
పక్కా ప్లాన్తో సీమాంధ్ర ఎంపీలకు చెక్
Published Thu, Feb 13 2014 3:15 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement