Sakshi News home page

పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా

Published Thu, Oct 15 2015 12:51 PM

పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా - Sakshi

భోపాల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ విధాన సభ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో భాగంగా చేపడుతున్న విచారణలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన గురువారం పోలీసుల వద్దకు వెళుతున్నారు. జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు.

1993 నుంచి 2003 మధ్యకాలంలో ఈ కుంభకోణం చేసుకుంది. ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జహంగిరాబాద్ పోలీసులు దిగ్విజయ్ సింగ్పై, నాటి స్పీకర్ శ్రీనివాస్ తివారీ, ఇతర వ్యక్తులపై విధాన సభకోసం జరిగిన రిక్రూట్ మెంట్లో మోసం, కుట్ర, నకిలీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement