'రూ. 20కే కిలో ఉల్లిపాయలు అందిస్తాం' | Sakshi
Sakshi News home page

'రూ. 20కే కిలో ఉల్లిపాయలు అందిస్తాం'

Published Wed, Sep 2 2015 2:46 PM

we distribute kilo onions per 20 rupees, says paritala sunitha

హైదరాబాద్: కిలో ఉల్లిపాయలను 20 రూపాయలకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఉల్లిపాయలను సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.

ఏపీలో ఇప్పటి వరకు 10,600 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు సరఫార చేశామని సునీత చెప్పారు. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. డిమాండ్ను బట్టి కిలో ఉల్లిపాయల ధర  60 రూపాయల వరకు పలుకుతోంది.

Advertisement
Advertisement