వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతాను: ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతాను: ఎమ్మెల్యే

Published Sun, Mar 26 2017 7:05 PM

వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతాను: ఎమ్మెల్యే - Sakshi

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులను అగౌరవపరిచే వాళ్లను, వాటిని చంపేవాళ్ల చేతులు, కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. యూపీ మంత్రి సురేష్ రాణా సన్మాన కార్యక్రమంలో సైనీ మాట్లాడుతూ.. 'వందేమాతరం అని చెప్పేందుకు నిరాకరించేవాళ్లను, భారత్‌ మాతా కీ జై అని పలికేందుకు అభ్యంతరం చెప్పేవాళ్లను, గోవును తల్లిలా చూడని వాళ్ల కాళ్లు, చేతులు విరగ్గొడతానని శపథం చేస్తున్నా. ఇలాంటి వాళ్లను చంపేస్తా' అని అన్నారు.

ఇలాంటి వాళ్లను ఎదుర్కొనేందుకు యువకులు ఓ జట్టుగా ఏర్పడాలని సైనీ పేర్కొన్నారు. ముజఫర్‌నగర్‌ జిల్లా ఖటౌలీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. 2013 ముజఫర్‌నగర్‌ దాడుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో గోవధశాలలను మూసివేయించారు.

Advertisement
Advertisement