యువతిపై యాసిడ్ దాడి | Sakshi
Sakshi News home page

యువతిపై యాసిడ్ దాడి

Published Thu, Dec 11 2014 1:55 PM

Woman attacked with acid in Srinagar

న్యాయవిద్య చదువుతున్న ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో జరిగింది. 21 ఏళ్ల ఆ యువతి శ్రీనగర్ నగరంలోని నౌషేరా ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు గుర్తు తెలియని దుండగులు గురువారం మధ్యాహ్నం ఆమెపై యాసిడ్ విసిరి పారిపోయారు.

ఆ యువతని వెంటనే షేరే కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్) సంస్థకు తరలించామని, ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. బాధితురాలు నగరంలోని ఓ న్యాయకళాశాలలో చదువుతోంది. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement