కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్ | Sakshi
Sakshi News home page

కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్

Published Thu, Sep 17 2015 4:21 PM

పోలీసుల అదుపులో నిందితులు

భోపాల్: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గురువారం ఉదయం 'నిర్భయ' తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంపీ నగర్ ప్రాంతంలో ఈ దారుణోదంతం జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఆగస్టు 5న వీఐపీ రోడ్డులో కదులుతున్న కారులో 24 ఏళ్ల మహిళపై నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన మరువకముందే మరొకటి జరగడం భోపాల్ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది.

Advertisement
Advertisement