మూడేళ్ల పాటు అత్యాచారం.. ఆపై పరారీ | Sakshi
Sakshi News home page

మూడేళ్ల పాటు అత్యాచారం.. ఆపై పరారీ

Published Fri, Aug 12 2016 12:44 PM

మూడేళ్ల పాటు అత్యాచారం.. ఆపై పరారీ - Sakshi

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మహిళపై మూడేళ్ల పాటు తరచు అత్యాచారం చేసిన 53 ఏళ్ల వ్యక్తి.. పరారయ్యాడు. ఆమె వాడా తాలూకాకు చెందినది కాగా, అతడు పొరుగున ఉన్న పాలగఢ్ జిల్లా వాసాయ్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు రోజుకూలీగా పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ఇటీవలే మరణించాడు. అతడు ఉన్నప్పటి నుంచే ఆమెపై అతడి అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. దిలీప్ శ్రీధర్ పాటిల్ అనే ఆ నిందితుడు కూడా కూలీగానే పనిచేస్తున్నాడు.

బాధితురాలు ఈ విషయం బయటపెడితే తామిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని భర్తకు చెబుతానంటూ అతడు బెదిరించేవాడు. భర్త మరణించిన తర్వాత కూడా అతడి అత్యాచార పర్వం కొనసాగింది. ఈసారి తన కోరిక తీర్చకపోతే పిల్లలకు చెబుతానని బెదిరించాడు. ఎట్టకేలకు ఆమె ధైర్యం కూడగట్టుకుని పాటిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్ల బట్టి నిందితుడు అకోలి, వజ్రేశ్వరి ప్రాంతాల్లోని వివిధ లాడ్జీలకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి మీద కేసు పెట్టి అతడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement