మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కు ఇప్పుడు పురుషుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందడం గమనార్హం. చాలామంది పురుషులు వారి భార్యలు, కుటుంబ సభ్యులు డబ్బుకోసం, ఆస్తి కోసం తమను తీవ్రంగా హింసిస్తున్నారని, లేదంటే విడాకులు కోరుతున్నారని ఆరోపిస్తున్నారు. కొందరైతే ఏకంగా తమను లైంగికంగా కూడా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కమిషన్... బాధిత పురుషులకు తగిన సహకారం అందించేందుకు ప్రయత్నిస్తోంది.
భారత రాజ్యాంగం ప్రకారం మహిళల హక్కులను పరిరక్షించడం కోసం 1994లో ఢిల్లీ కమిషన్ మహిళా చట్టాన్ని తీసుకు వచ్చింది. అలాగే పురుఫుల సమస్యలను చర్చించేందుకు కూడా కమిషన్ నిర్ణయించింది. మొదట్లో కార్యాలయానికి పురుషులు వస్తే తాము ఎంతో ఆశ్చర్యపోయామని, వారు తమ భార్యల వేధింపులను భరించలేకపోతున్నామంటూ ఫిర్యాదులు చేసేవారని, వాటిలో ఎక్కువగా మానసిక, శారీరక హింస గురించి ఉండటంతో వాటిని స్వీకరించాల్సి వచ్చేదని.. డిసిడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ తెలిపారు.
కాగా అటువంటి కేసులు తమ దగ్గరకు వచ్చినపుడు సాధారణంగా బాధితుల భార్యలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంటామని, వారిపై ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తామని కమిషన్ సీనియర్ అధికారి చెప్తున్నారు. ఈ కుటుంబ తగాదాలు ఎంతో సున్నితంగా ఉంటాయని, అటువంటప్పుడు భార్యాభర్తలతోపాటు వారి కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను చర్చిస్తామని, సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తామని, లేదా మధ్యవర్తిత్వం కోసం ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్దకు పంపిస్తామని అంటున్నారు.
అయితే విషయం తీవ్రంగా అనిపించినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేందుకు రిఫర్ చేస్తామని ఆయన చెప్తున్నారు. అటువంటి పలు సందర్భాల్లో మహిళలకు వారి కుటుంబం నుంచీ మద్దతు ఉన్నట్లుగా బాధిత పురుషులకు ఉండటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పురుషులకు ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ సహాయపడుతోందని వారు చెప్తున్నారు.
బాధిత పురుషుల రక్షణలో... ఆ 'సెల్'
Published Mon, Oct 26 2015 4:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement