ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'నేను రాహుల్గాంధీ కంటే ఏడాది చిన్నవాడిని. అఖిలేశ్ యాదవ్ కంటే ఏడాది పెద్దవాడిని. కనుక నేను వారి జోడీ (పొత్తు) మధ్యలోకి వచ్చి ఉంటాను. అందువల్ల వాళ్ల కూటమి విఫలమైంది' అంటూ యోగి ఛలోక్తి విసిరారు.
ఇప్పటికీ ఎంపీగా కొనసాగుతున్న సీఎం యోగి మంగళవారం పార్లమెంటులో వీడ్కోలు ప్రసంగాన్ని ఇచ్చారు. బీజేపీ సభ్యులు 'భారత్ మతాకీ జై' నినదిస్తుండగా లోక్సభలో అడుగుపెట్టిన యోగి.. యూపీలో గూండారాజ్ను అంతం చేస్తానని ప్రతిన బూనారు. అందరి వికాసానికి ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని, ఆయన దారిలోనే సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదంతో యూపీలో ముందుకెళుతామని యోగి పేర్కొన్నారు.