రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవం చేయండి.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవం చేయండి..

Published Thu, Aug 27 2015 11:31 AM

రాష్ట్రానికి రక్షా బంధన్  దినోత్సవం చేయండి.. - Sakshi

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టబోయే బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ నెల 29వ తేదీన చేయనున్న బంద్ను రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవంగా చేయాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికో, స్వార్థం కోసమో కాదని...రాష్ట్ర శ్రేయస్సు కోసం బంద్ చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ బంద్కు వామపక్షాలు మద్దతు తెలిపాయని ఆయన పేర్కొన్నారు.  పరిశ్రమల స్థాపనకు, ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక హోదా  తప్పనిసరి  అని బొత్స అన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... 10 ఏళ్లు అని బీజేపీ, టీడీపీ మోసం చేశాయని ఆయన మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement