కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే అతిపెద్ద సవాల్ అని బీజేపీ నేత, టీవీ నటి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములకు యువ నేతనే కారణమని అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అని ఆమె విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ చేతిలో కాంగ్రెస్ పార్టీ మట్టికరవడం తథ్యం అని స్మృతి జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలని, రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయమేమైనా ఉంటే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రిడిబిలిటీ ఉన్న నాయకుడు ఉన్నారని తాను భావించడం లేదని ఆమె అన్నారు. రాహుల్ నాయకత్వం తీరే పార్టీ ఓటమికి కారణమా లేదా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి అని స్మృతి ఇరానీ అన్నారు.