ఖమ్మం వ్యవసాయం: మొక్కజొన్న పంటను జిల్లాలో 8,230 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కె.6, జె.ఎల్.24, ట్యాగ్-24 తదితర రకాలను వేశారు. జూన్, జులై నెలల్లో విత్తిన మొక్కజొన్నను కాండం తొలిచే పురుగు ఆశించింది. జింక్, భాస్వరం లోపాలు కూడా ఉన్నట్లు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణపై కోఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్కుమార్ ‘సాక్షి’కి వివరించారు.
కాండం తొలిచే పరుగు...
కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 10-20 రోజులకు పైరును ఆశిస్తుంది. పిల్లపురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తింటాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది వెడల్పు రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుసక్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని ఆశించటం వల్ల దిగుబడి తగ్గుతుంది.
నివారణ చర్యలు...
పొలంలో కలుపు మొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి.
పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
పొలం చుట్టూ 3-4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి.
అంతర్పంటలుగా అపరాలు (కంది, సోయాబీన్, బొబ్బర్లు) సాగు చేయడం వల్ల సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది.
మోనోక్రొటోఫాస్ 36 యస్.ఎల్ మందును ఎకరాకు 320 మి.లీ 200 లీటర్ల నీటికి కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారీ చేయాలి.
ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి.
జింక్ లోపం..
జింక్ లోపం వల్ల ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. లేదా లేత పైరు తెల్లమొగ్గగా మారుతుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్సల్ఫేట్ను మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి. పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంతగా తేమ ఉండాలి. మొదటి దఫా ఎరువులు వేసిన తర్వాత సాళ్లలోని మట్టిని మొక్కల మొదళ్లలోకి ఎగదోయాలి.
మొక్కజొన్న రైతులూ జాగ్రత్త
Published Tue, Aug 19 2014 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
Advertisement