పరిగి: ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో రైతులు పంటలకు ఎరువులు వేయటం ప్రారంభించారు. ఎరువుల వాడకంలో రైతుల అవగాహన లోపంతోనే యూరియా సమస్య తలెత్తుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో యూరియా ఎక్కువగా వాడుతుండటంతో కొరత కూడా ఏర్పడుతోంది.
మోతాదు కంటే రెండింతల యూరియాను రైతులు వాడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూరియా అధికంగా వాడటం వల్ల మొక్క ఎక్కువ పచ్చగా, ఎక్కువ మెత్తగా మారుతుంది. దీంతో చీడపీడలు అధికమయ్యే అవకాశముంది. ఖర్చు పెరగటంతో పాటు పురుగుల మందులు కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. తద్వారా పెట్టుబడులు గణనీయంగా పెరిగి దిగుబడులపై, రైతులకు వచ్చే నికర లాభాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పంటలకు యూరియా వాడకంపై వ్యవసాయ శాఖ అధికారి రేణుకా చక్రవర్తిని సూచనలు అందజేశారు. భూముల సారాన్ని బట్టి ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని చెప్పారు.
ఎంత మోతాదులో..
డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పనిసరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందున ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగుళాల లోతులో డీఏపీ వేయాలి. మిగతా అన్ని ఖరీప్ పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి. ఒకవేళ మొక్కలకు వేయాలంటే భూమిలో గోతులు తీసి వేయాలి.
యూరియా ప్రతి ఎకరానికి వంద కిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి విత్తిన 20 రోజుల నుంచి మూడు నుంచి నాలుగుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగుసార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తర్వాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది. అయితే రైతులు వేసిన ప్రతిసారి ఎకరానికి రెండు బస్తాల యూరియా అంటే 100 కేజీలు ఒకేసారి వాడుతున్నారు. మొక్కలకు కనీసం ఐదు సెంటీమీటరల దూరంలో యూరియా వేయాల్సి ఉండగా రైతులకు అవగాహన లేమితో మొక్కకు ఆనుకుని వేస్తున్నారు.
ఏ ఎరువును ఎందుకు ఉపయోగిస్తారు..
ఏ ఎరువును ఎందుకు ఉపయోగిస్తారనే విషయంలో అవగాహన రైతులకు లేకపోవటంతో అన్ని రకాల అవసరాలకు ధర తక్కువగా ఉన్న ఎరువునే ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడంతో ఆయా ఎరువులు పంటకు మేలు చేయటం అటుంచి కీడే ఎక్కువగా చేస్తున్నాయి. యూరియా వాడటం వల్ల పంట ఏపుగా, పచ్చగా వస్తుంది. మోతాదుకు మించి వాడితే తెగుళ్లు సోకే అవకాశం ఉంది. డీఏపీ వాడటం వల్ల వేర్లు, కొమ్మలు, రెమ్మలు ఎక్కువగా వస్తాయి. భాస్వరం వాడటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఈ సంవత్స రం కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగటం తో ఎరువులు సమపాళ్లలో వాడకుండా ధర తక్కువగా ఉన్న యూరియాను ఎక్కువగా వాడుతున్నారు.
డీఏపీ ధర పెరగటమూ సమస్యకు కారణమే..
గత సంవత్సరం నుంచి డీఏపీ ధరలు విపరీతంగా పెరగటంతో యూరియాపై ప్రభావం చూపుతోంది. ధరలను తట్టుకోలేక డీఏపీ వేయాల్సిన పొలాలకు కూడా రైతులు యూరియానే వేస్తున్నారు. ఒక్క డీఏపీ బస్తాకు పెట్టే డబ్బులు పెడితే నాలుగు బస్తాల యూరియా వస్తుంది. దీంతో కొందరు రైతులు యూరియా అవసరం లేకున్నా, పొలానికి డీఏపీ అవసరం ఉన్నా యూరి యానే తీసుకెళ్లీ వేస్తుం డటం కూడా సమస్యకు కారణమవుతోంది.
యూరియా అతిగా వేయొద్దు
Published Wed, Sep 10 2014 11:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement