ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు

12 Jan, 2018 14:35 IST|Sakshi

ముగ్గురికి తీవ్ర గాయాలు

సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మర్రిపాలెం వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గర్భిణీతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు